ఎన్నో బలిదానాలతో సాధించుకున్నా.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. టీఆర్టీ నియామకం చేపట్టి ఉద్యోగాలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవన్రెడ్డి వారికి సంఘీభావం తెలిపి సర్కారుపై విరుచుకుపడ్డారు. పీఆర్సీ, సీపీఎస్ విధానం రద్దు, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ తదితర సమస్యలపై డిమాండ్లు చేశారు.
ఇదీ చదవండిః ఏ క్షణమైనా కుమారస్వామి సర్కార్ పతనం!