ETV Bharat / state

గ్రామాలపై కరోనా పంజా.. మరో ఊరిలో స్వచ్ఛంద లాక్​డౌన్ - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ ప్రభావంతో చాలా గ్రామాల్లో ఇప్పటికే స్వచ్ఛంద లాక్​డౌన్ విధించుకున్నాయి. జగిత్యాల జిల్లాలోని మరో గ్రామం లాక్​డౌన్ ప్రకటించింది. ఊరిలో 30 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.

lock down in katakpur village, corona cases in kakatpur village
కట్కాపూర్ గ్రామంలో లాక్​డౌన్, కట్కాపూర్ గ్రామంలో కరోనా కేసులు
author img

By

Published : Apr 7, 2021, 3:47 PM IST

రాష్ట్రంలోని గ్రామాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండో దశలో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జగిత్యాల జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్​డౌన్ ప్రకటించుకున్నాయి. తాజాగా రాయికల్ మండలం కట్కాపూర్‌ గ్రామంలో 30 మందికిపైగా వైరస్ నిర్ధారణ అయింది. ఫలితంగా ఆ ఊరిలో లాక్​డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది.

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున లాక్​డౌన్‌ విధిస్తున్నట్లు గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని పంచాయతీ అధికారులు ప్రకటించారు.

రాష్ట్రంలోని గ్రామాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండో దశలో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జగిత్యాల జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్​డౌన్ ప్రకటించుకున్నాయి. తాజాగా రాయికల్ మండలం కట్కాపూర్‌ గ్రామంలో 30 మందికిపైగా వైరస్ నిర్ధారణ అయింది. ఫలితంగా ఆ ఊరిలో లాక్​డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది.

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున లాక్​డౌన్‌ విధిస్తున్నట్లు గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని పంచాయతీ అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.