రాష్ట్రంలో పంట నష్టపోయి ఈ మధ్యనే ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వారికి ప్రభుత్వం భరోసాని కల్పించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అన్ని పంటలను మద్దతు ధరకు కొనాలని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినా.. కేసీఆర్ ఫాంహౌస్ దాటకుండా రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
దుబ్బాకలో దొరికిన డబ్బుల వ్యవహారంలో ఈసీ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం ముంపునకు గురైనా కనీసం సీఎం కేసీఆర్ పరామర్శించకపోవటం బాధకరమన్నారు.
ఇదీ చూడండి: నాయిని సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపం