జగిత్యాల జిల్లాలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించారు. ఎస్పీ సింధు శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేతనంతో సంబంధం లేకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు
. అపోలో, మేడికేర్, జీఎంఆర్ తదితర కంపెనీలు అర్హత కలిగిన యువకులకు ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చాయి. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ, సుమారు 400 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.