ప్రభుత్వ ఆదేశాలతో.. జగిత్యాల జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో కొవిడ్ ఇంటింటి సర్వే ప్రారంభమైంది. ప్రతి 500 నివాసాలకు ఒక బృందం చొప్పున.. ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. కరోనా బాధితులను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నారు.
లక్షణాలు ఉన్న వారికి.. సిబ్బంది వెంటనే రాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. తీవ్రత ఎక్కుగా ఉంటే ఐసోలేషన్ సెంటర్కు తరలించి చికిత్స అందించనున్నారు. స్పల్ప లక్షణాలున్న ఉన్న వారు.. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకునేలా అవగాహన కలిపిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి కేరళలో లాక్డౌన్