ETV Bharat / state

త్వరలోనే పూర్తిస్థాయిలో పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన - మహేశ్​కుమార్ గౌడ్ - Mahesh Kumar Goud Chit Chat

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Maheshkumar Goud Chitchat : రాష్ట్రంలో నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకంతో, పాత పీసీసీ కార్యవర్గం రద్దు అయ్యిందని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన అనంతరం డీసీసీ అధ్యక్షుల గురించి ఆలోచిస్తామని తెలిపారు.

MAHESH KUMAR GOUD SLAMS HARISH RAO
Maheshkumar Goud Chitchat (ETV Bharat)

Maheshkumar Goud Chitchat : ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో స్థానిక నేతలు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నట్లు నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైడ్రా, మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బంది అయినా హైదరాబాద్ నగర ప్రజల మొత్తానికి లాభం జరుగుతుందని ఆయన తెలిపారు.

పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన : ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌ మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీసీసీ కార్యవర్గంలో మూడు నుంచి అయిదు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల పదవులు ఉంటాయని ఆయన వెల్లడించారు. పాత పీసీసీ కార్యవర్గం, నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకంతో రద్దు అయ్యిందని, పీసీసీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల పదవులు రద్దు కావన్న మహేశ్​కుమార్​ గౌడ్, పీసీసీ కార్యవర్గం తర్వాత డీసీసీ అధ్యక్షుల గురించి ఆలోచిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన వివరించారు. ఇన్ని రోజులు మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్లు హరీశ్​రావుకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు తాము వెళ్తే, తమను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని దుయ్యబట్టారు. డీసీసీలుగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు ఆయన వివరించారు.

మరోవైపు ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌తో, 2017 గురుకుల వ్యాయామ ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ నియమాకాలపై తమ సమస్యను విన్నవించారు. ఇప్పటి వరకు తమకు నియామక పత్రాలు ఇవ్వలేదని, ఇప్పించేట్లు చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మహేశ్​కుమార్ గౌడ్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నియామక పత్రాలు ఇచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించడంతో, చొరవ చూపిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు, సీఎం రేవంత్‌ రెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మూసీ అంశంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దు : మహేశ్​కుమార్‌ గౌడ్‌ - Public Face to Face with Ministers

"స్థానిక ఎన్నికలే తొలి సవాల్​ - సత్తా చాటకుంటే భవిష్యత్తు ఎన్నికల్లో నో టికెట్" - Congress On Local Body Elections

Maheshkumar Goud Chitchat : ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో స్థానిక నేతలు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నట్లు నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైడ్రా, మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బంది అయినా హైదరాబాద్ నగర ప్రజల మొత్తానికి లాభం జరుగుతుందని ఆయన తెలిపారు.

పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన : ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌ మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీసీసీ కార్యవర్గంలో మూడు నుంచి అయిదు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల పదవులు ఉంటాయని ఆయన వెల్లడించారు. పాత పీసీసీ కార్యవర్గం, నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకంతో రద్దు అయ్యిందని, పీసీసీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల పదవులు రద్దు కావన్న మహేశ్​కుమార్​ గౌడ్, పీసీసీ కార్యవర్గం తర్వాత డీసీసీ అధ్యక్షుల గురించి ఆలోచిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన వివరించారు. ఇన్ని రోజులు మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్లు హరీశ్​రావుకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు తాము వెళ్తే, తమను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని దుయ్యబట్టారు. డీసీసీలుగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు ఆయన వివరించారు.

మరోవైపు ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌తో, 2017 గురుకుల వ్యాయామ ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ నియమాకాలపై తమ సమస్యను విన్నవించారు. ఇప్పటి వరకు తమకు నియామక పత్రాలు ఇవ్వలేదని, ఇప్పించేట్లు చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మహేశ్​కుమార్ గౌడ్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నియామక పత్రాలు ఇచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించడంతో, చొరవ చూపిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు, సీఎం రేవంత్‌ రెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మూసీ అంశంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దు : మహేశ్​కుమార్‌ గౌడ్‌ - Public Face to Face with Ministers

"స్థానిక ఎన్నికలే తొలి సవాల్​ - సత్తా చాటకుంటే భవిష్యత్తు ఎన్నికల్లో నో టికెట్" - Congress On Local Body Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.