జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కాశీబాగ్ ఆంజనేయస్వామికి మండలదీక్ష భక్తులు అభిషేకాలు నిర్వహించారు. వేకువ జామున నుంచే స్వామివారికి పంచామృతాభిషేకం, ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు.
వెయ్యి కమల పుష్పాలతో ఆంజనేయస్వామిని అలంకరించారు. మండలదీక్ష భక్తులు భజనలు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం, అంజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.