ETV Bharat / state

ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో భక్తుల రద్దీ - huge no of devotees at dharmapuri temple

కార్తిక చతుర్దశిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Crowds of devotees at the Dharmapuri Lakshminarasimha Temple due to karthika chathurdashi
ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో భక్తుల రద్దీ
author img

By

Published : Dec 13, 2020, 1:09 PM IST

కార్తిక చతుర్దశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

అనంతరం ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. షష్టి మల్లన్న ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో గోదావరినదిలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు.

కార్తిక చతుర్దశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

అనంతరం ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. షష్టి మల్లన్న ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో గోదావరినదిలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు.

ఇదీ చూడండి:ప్రకటనలకే పరిమితం.. కానరాని ప్రత్యామ్నాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.