కార్తిక చతుర్దశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. షష్టి మల్లన్న ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో గోదావరినదిలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఇదీ చూడండి:ప్రకటనలకే పరిమితం.. కానరాని ప్రత్యామ్నాయం