ETV Bharat / state

మాస్క్​ లేకుండా తిరిగితే ఫైన్​ కట్టాల్సిందే..!

author img

By

Published : Apr 9, 2021, 4:56 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మెట్​పల్లిలో మాస్క్​ లేకుంటే ఫైన్​
మెట్​పల్లిలో మాస్క్​ లేకుంటే ఫైన్​

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడం పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పరిధిలోని 26 వార్డుల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఫలితంగా వివిధ గ్రామాల నుంచి అవసరాల నిమిత్తం మెట్​పల్లికి వచ్చే వారికీ వైరస్​ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్డీవో వినోద్ కుమార్, పురపాలక కమిషనర్ సమ్మయ్య, పోలీసులు సమష్టిగా తనిఖీలు చేపట్టారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా వ్యాపారస్థులకూ పలు సూచనలు చేశారు. కరోనా బారినపడకుండా ప్రజలు నిబంధనలు పాటించాలని, అలా పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడం పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పరిధిలోని 26 వార్డుల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఫలితంగా వివిధ గ్రామాల నుంచి అవసరాల నిమిత్తం మెట్​పల్లికి వచ్చే వారికీ వైరస్​ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్డీవో వినోద్ కుమార్, పురపాలక కమిషనర్ సమ్మయ్య, పోలీసులు సమష్టిగా తనిఖీలు చేపట్టారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా వ్యాపారస్థులకూ పలు సూచనలు చేశారు. కరోనా బారినపడకుండా ప్రజలు నిబంధనలు పాటించాలని, అలా పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.