జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా ఈరోజు 29 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ సోకిన వారిలో జిల్లా స్థాయి అధికారి, ఎస్సై దంపతులతో పాటు మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. జిల్లాలో మొత్తం కొత్త కేసుల సంఖ్య 280కి చేరుకుంది.
కరోనా సోకిన వారికి ఇంట్లోనే వైద్యం అందిస్తున్నారు. వైరస్ తీవ్రంగా ఉన్నవారికి మాత్రం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.