ETV Bharat / state

రాబిస్​ టీకా.. జూనోసిస్​ దినోత్సవం వాయిదా

author img

By

Published : Jul 5, 2020, 6:20 PM IST

ప్రతి సంవత్సరం జులై 6వ తేదీన నిర్వహించిన జూనోసిస్ డేను కరోనా కట్టడిలో భాగంగా వాయిదా వేస్తున్నట్టు నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పెంపుడు జంతువుల యజమానులు ఎవరూ రాబిస్​ వ్యాక్సిన్​ కోసం పశువులను ఆసుపత్రికి తీసుకురావద్దని కోరారు. ​

http://10.10.50.75:6060///finalout2/bihar-nle/finalout/05-July-2020/7890004_madhepura.jpg
రాబిస్​ టీకా.. జూనోసిస్​ దినోత్సవం వాయిదా

ఏటా జులై 6వ తేదీన శునకాలు, పశువులకు ముందు జాగ్రత్తలో భాగంగా ఇచ్చే రాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు రాబిస్ వ్యాధి సోకకుండా ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 సంవత్సరం జూలై 6వ తేదీన యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మనుషులపై విజయవంతంగా ప్రయోగించారు. నాటి నుంచి నేటి వరకు జూలై 6ను జూనోసిస్ డే గా పిలుస్తూ పశువులు, పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం ఈ నెల ఆరవ తేదీన జూనోసిస్ డే ను నిర్వహించడం లేదని నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల నుంచి పెంపుడు జంతువులను తీసుకొని వందలాది మంది వాటి యజమానులు రావడం వల్ల వైరస్​ మరింత విస్తరించే అవకాశం లేకపోలేదని ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పశుసంవర్ధక శాఖ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా హైదరాబాద్ విట్టల్​వాడిలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడు రోజుల క్రితం తాత్కాలికంగా మూసి వేశారు. ఆసుపత్రిలోని నలుగురికి వైరస్​ సోకడమే దీనికి కారణమని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించాయి.

ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

ఏటా జులై 6వ తేదీన శునకాలు, పశువులకు ముందు జాగ్రత్తలో భాగంగా ఇచ్చే రాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు రాబిస్ వ్యాధి సోకకుండా ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 సంవత్సరం జూలై 6వ తేదీన యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మనుషులపై విజయవంతంగా ప్రయోగించారు. నాటి నుంచి నేటి వరకు జూలై 6ను జూనోసిస్ డే గా పిలుస్తూ పశువులు, పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం ఈ నెల ఆరవ తేదీన జూనోసిస్ డే ను నిర్వహించడం లేదని నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల నుంచి పెంపుడు జంతువులను తీసుకొని వందలాది మంది వాటి యజమానులు రావడం వల్ల వైరస్​ మరింత విస్తరించే అవకాశం లేకపోలేదని ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పశుసంవర్ధక శాఖ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా హైదరాబాద్ విట్టల్​వాడిలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడు రోజుల క్రితం తాత్కాలికంగా మూసి వేశారు. ఆసుపత్రిలోని నలుగురికి వైరస్​ సోకడమే దీనికి కారణమని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించాయి.

ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.