ETV Bharat / state

దుర్భాషలాడారని... తనువు చాలించిన యువతి - ఇరుగుపొరుగు వారు తిట్టారని యువతి ఆత్మహత్య

ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతితో ఇరుగుపొరుగున ఉన్న ముగ్గురు వ్యక్తులు అసభ్యంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.

young-lady-suicide-in-anantapuram-district
దుర్భాషలాడారని... తనువు చాలించిన యువతి
author img

By

Published : Aug 27, 2020, 6:09 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని సైదాపురానికి చెందిన వెంకటరమణ కుమార్తె పుష్పాంజలి బి. పార్మసీ చదువుతోంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా పుష్పాంజలి ఇంట్లోనే ఉంది. గ్రామంలో ఉన్న నగేష్, కేశవ, నాగేశ్వరమ్మ... పుష్పాంజలితో గొడవ పడి దుర్భాషలాడారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి గుండెలు పగిలెలా ఏడ్చారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని సైదాపురానికి చెందిన వెంకటరమణ కుమార్తె పుష్పాంజలి బి. పార్మసీ చదువుతోంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా పుష్పాంజలి ఇంట్లోనే ఉంది. గ్రామంలో ఉన్న నగేష్, కేశవ, నాగేశ్వరమ్మ... పుష్పాంజలితో గొడవ పడి దుర్భాషలాడారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి గుండెలు పగిలెలా ఏడ్చారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: నవంబర్ 15 నుంచి రామగుండంలో 'కిసాన్ బ్రాండ్' యూరియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.