ETV Bharat / state

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: రాజా సింగ్

author img

By

Published : Sep 6, 2020, 3:17 PM IST

హైదరాబాద్ గోషామహల్ పరిధిలో కొవిడ్ వారియర్స్​ను ఎమ్మెల్యే రాజాసింగ్ ఘనంగా సత్కరించారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆశ వర్కర్లను, జలమండలి ఉద్యోగుల విలువైన సేవలను కొనియాడారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై భాజపా గళాన్ని వినిపిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. ఈసారి విస్తారంగా కురిసిన వర్షాలకు అన్నదాతల పంట పొలాలు నీట మునిగితే ప్రభుత్వం పరిహారం విషయంలో తాత్సారం చేస్తోందన్నారు. వీటిపైనా పెద్ద ఎత్తున చర్చలకు తమ పార్టీ పట్టుబడుతుందని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: రాజా సింగ్
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: రాజా సింగ్

సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై తమ పార్టీ గళాన్ని వినిపిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే, భాజపా శాసన సభా పక్షనేత రాజా సింగ్ అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా రైతుల పంట పొలాలు నీట మునిగాయని.. వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. గోషామహల్ నియోజకవర్గం గన్ ఫౌండ్రిలో భాజపా యువ నాయకుడు భీష్మ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో... కొవిడ్ వారియర్స్​ను సన్మానించిన కార్యక్రమంలో రాజా సింగ్ పాల్గొన్నారు.

'ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం'

వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆశ వర్కర్లను, జలమండలి ఉద్యోగులను రాజాసింగ్ ఘనంగా సత్కరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తామ మాట్లాడేందుకు రెండు, మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 15 అంశాలపై సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: రాజా సింగ్

'పగటి కలలు కంటున్నారు'

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన రాకముందే తెరాస నాయకులు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని తెలిపారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలే అధికార తెరాసకు గుణపాఠం చెప్తారని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం

సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై తమ పార్టీ గళాన్ని వినిపిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే, భాజపా శాసన సభా పక్షనేత రాజా సింగ్ అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా రైతుల పంట పొలాలు నీట మునిగాయని.. వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. గోషామహల్ నియోజకవర్గం గన్ ఫౌండ్రిలో భాజపా యువ నాయకుడు భీష్మ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో... కొవిడ్ వారియర్స్​ను సన్మానించిన కార్యక్రమంలో రాజా సింగ్ పాల్గొన్నారు.

'ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం'

వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆశ వర్కర్లను, జలమండలి ఉద్యోగులను రాజాసింగ్ ఘనంగా సత్కరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తామ మాట్లాడేందుకు రెండు, మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 15 అంశాలపై సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: రాజా సింగ్

'పగటి కలలు కంటున్నారు'

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన రాకముందే తెరాస నాయకులు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని తెలిపారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలే అధికార తెరాసకు గుణపాఠం చెప్తారని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.