ETV Bharat / state

గాలిలోని తేమ నుంచి తాగునీటి తయారీ - water prepared by air moisture in secundrabad railway station

గాలితో విద్యుత్​ తయారు చేయగలం. కానీ గాలిలోని తేమతో తాగునీరు తయారు చేయడం సాధ్యమా? సాధ్యమేనండోయ్​... ఎలానో తెలుసుకోవాలంటే.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​కు ఓసారి వెళ్లాల్సిందే!

water prepared by air moisture in secundrabad railway station
గాలిలోని తేమ నుంచి తాగునీటి తయారీ
author img

By

Published : Dec 12, 2019, 9:56 PM IST

గాలిలోని తేమ నుంచి తాగునీటి తయారీ

రైల్వే ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. ప్రయాణికులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో మేఘదూత్​ వాటర్​ కియోస్క్​ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో గాలిలోని తేమతో తాగునీరు తయారు చేస్తారు. ఆ నీరు మినరల్​ వాటర్​ కంటే శుద్ధిగా ఉంటుంది.

మొదటగా సికింద్రాబాద్​లో...

దేశంలోనే మొట్టమొదటగా... ఈ పరికరాన్ని సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో అందుబాటులోకి తెచ్చారు. రైల్వే ఉన్నతాధికారులు సంజీవ్​ లోహియా, మైత్రి ఆక్వాడేట్​ సంస్థ ఎండీ రామకృష్ణ ప్రారంభించారు. స్టేషన్​లో ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు మైత్రి ఆక్వాడేట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ సంస్థకు ఈ బాధ్యత అప్పగించింది దక్షిణ మధ్య రైల్వే.

మినరల్​ వాటర్​ కంటే శుద్ధిగా

రైల్వేలో ప్రయాణికులకు మంచినీరు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే అభివృద్ధి సంస్థ ఎండీ లోహియా తెలిపారు. మినరల్ వాటర్ కంటే కూడా ఈ నీరు మరింత శుద్ధిగా ఉంటుందని వెల్లడించారు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.

తేమను ఒడిసిపట్టి

భారత రసాయనిక సాంకేతిక సంస్థ సహకారంతో మేక్ ఇన్ ఇండియా చొరవతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నట్లు మైత్రి సంస్థ ఎండీ రామకృష్ణ​ తెలిపారు. ఈ విధానంలో గాలిలోని తేమను ఒడిసిపట్టి, పలుమార్లు వడపోసి శుద్ధి చేయడం ద్వారా మంచినీరు తయారవుతుందని రంజన్​ వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజు వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

సరసమైన ధరకే...

ఇప్పటి వరకు పరిశ్రమలు, కార్పొరేట్​ సంస్థల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని మన దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఐఆర్​సీటీసీ అందిస్తున్న ధరలకే ఈ నీటిని ప్రజలకు అందిస్తున్నారు. దీనిద్వారా మామూలు ధరకే శుద్ధమైన తాగనీరు ప్రయాణికులకు అందుతోంది.

గాలిలోని తేమ నుంచి తాగునీటి తయారీ

రైల్వే ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. ప్రయాణికులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో మేఘదూత్​ వాటర్​ కియోస్క్​ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో గాలిలోని తేమతో తాగునీరు తయారు చేస్తారు. ఆ నీరు మినరల్​ వాటర్​ కంటే శుద్ధిగా ఉంటుంది.

మొదటగా సికింద్రాబాద్​లో...

దేశంలోనే మొట్టమొదటగా... ఈ పరికరాన్ని సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో అందుబాటులోకి తెచ్చారు. రైల్వే ఉన్నతాధికారులు సంజీవ్​ లోహియా, మైత్రి ఆక్వాడేట్​ సంస్థ ఎండీ రామకృష్ణ ప్రారంభించారు. స్టేషన్​లో ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు మైత్రి ఆక్వాడేట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ సంస్థకు ఈ బాధ్యత అప్పగించింది దక్షిణ మధ్య రైల్వే.

మినరల్​ వాటర్​ కంటే శుద్ధిగా

రైల్వేలో ప్రయాణికులకు మంచినీరు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే అభివృద్ధి సంస్థ ఎండీ లోహియా తెలిపారు. మినరల్ వాటర్ కంటే కూడా ఈ నీరు మరింత శుద్ధిగా ఉంటుందని వెల్లడించారు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.

తేమను ఒడిసిపట్టి

భారత రసాయనిక సాంకేతిక సంస్థ సహకారంతో మేక్ ఇన్ ఇండియా చొరవతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నట్లు మైత్రి సంస్థ ఎండీ రామకృష్ణ​ తెలిపారు. ఈ విధానంలో గాలిలోని తేమను ఒడిసిపట్టి, పలుమార్లు వడపోసి శుద్ధి చేయడం ద్వారా మంచినీరు తయారవుతుందని రంజన్​ వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజు వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

సరసమైన ధరకే...

ఇప్పటి వరకు పరిశ్రమలు, కార్పొరేట్​ సంస్థల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని మన దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఐఆర్​సీటీసీ అందిస్తున్న ధరలకే ఈ నీటిని ప్రజలకు అందిస్తున్నారు. దీనిద్వారా మామూలు ధరకే శుద్ధమైన తాగనీరు ప్రయాణికులకు అందుతోంది.

Intro:సికింద్రాబాద్ యాంకర్.. గాలిలో తేమ తో తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది..రైల్వే ప్రయాణికుల దాహార్తిని తీర్చే క్రమంలో శుద్ధమైన తాగునీటిని అందించే అత్యాధునిక "మేఘదూత్ వాటర్ కియోస్క్" విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు..అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ప్లాట్ఫారం నెంబర్ వన్ లో నూతనంగా ప్రాజెక్టును ప్రారంభించారు..రైల్వే ఉన్నతాధికారులు రంజన్ పాండా,మైత్రి ఆక్వా డేట్ సంస్థ ఎం. డి లోహియా ప్రారంభించారు..
ఆయన మాట్లాడుతూ రైల్వే లో ప్రయాణించే ప్రయాణికులకు మంచినీరు అందించాలని ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు..ప్రధానమంత్రి మోడీ మేకిన్ ఇండియా లో భాగంగా రైల్వే ప్రయాణికులకు శుద్ధమైన నీటిని అందించే క్రమంలో అత్యాధునిక పరిజ్ఞానంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు...మినరల్ వాటర్ కంటే కూడా ఈ నీటి మరింత శుద్ధి గా ఉంటుందని 24 గంటలు ప్రజలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు ..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు మైత్రి ఆక్వాడేట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ సంస్థకు అప్పగించింది..భారత రసాయనిక సాంకేతిక సంస్థ సహకారంతో మేక్ ఇన్ ఇండియా చొరవతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న టు తెలిపారు..ఈ విధానంలో గాలిలోని తేమను ఒడసిపట్టి అని పలుమార్లు వడపోసి శుద్ధి చేస్తారని అన్నారు..ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు..ఐ ఆర్ టి సి టి ప్రస్తుతం అందిస్తున్న ధరలకే ఈ నీటిని ప్రజలకు అందించనున్నట్లు వెల్లడించారు..సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు..ఈ ప్రాజెక్టు యొక్క పనితీరు గురించి దాని విధానాల గురించి సవివరంగా తెలియజేశారు..గాలిలోని తేమ నువ్వు ఏ విధంగా మిషన్లో నుండి నీరుగా మార్చి ఒక పెద్ద ట్యాంక్ లో స్టోరేజ్ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్ విధానం ద్వారా నీటిని ప్రజలకు తగిన ధరలో అందించనున్నట్లు తెలిపారు..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ప్లాట్ఫారం 1 మరియు పది వద్ద రెండు ప్రాజెక్టులు ప్రారంభించినట్లు వెల్లడించారు
బైట్..లోహియా..ఎం.డి రైల్వే స్టేషన్ అభివృద్ధి సంస్థ ఎం.డి
బైట్..రామకృష్ణ..మైత్రి ఆక్వా టెక్ సంస్థ ఎం.డి
బైట్ శ్యాంసుందర్ సంస్థ నిర్వాహకుడు
బైట్ ప్రీతి పాల్ సింగ్ Body:VamshiConclusion:7032301099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.