ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన విజయశాంతి

author img

By

Published : Mar 8, 2021, 4:19 PM IST

నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి.. వారితో సరదాగా గడిపారు.

Vijaya Shanti On Women's Day celebrations at hyderabad
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన విజయశాంతి

హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో... అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొన్నారు.

లాక్‌డౌన్ సమయంలో విశేష సేవలందించిన జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులతో విజయశాంతి సరదాగా గడిపారు. వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారితో ఫొటోలు దిగి ముచ్చటించారు. కరోనా కష్టకాలంలో పడిన ఇబ్బందులను... విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.

Vijaya Shanti On Women's Day celebrations at hyderabad
కార్మికురాలితో ముచ్చటిస్తున్న విజయశాంతి

ఇదీ చూడండి: చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి: తలసాని

హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో... అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొన్నారు.

లాక్‌డౌన్ సమయంలో విశేష సేవలందించిన జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులతో విజయశాంతి సరదాగా గడిపారు. వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారితో ఫొటోలు దిగి ముచ్చటించారు. కరోనా కష్టకాలంలో పడిన ఇబ్బందులను... విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.

Vijaya Shanti On Women's Day celebrations at hyderabad
కార్మికురాలితో ముచ్చటిస్తున్న విజయశాంతి

ఇదీ చూడండి: చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.