ETV Bharat / state

'నెలాఖరు లోపు కోర్​కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి' - vh letter about conducting core committe meeting to uttam kumar reddy

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జులై నెలాఖరు లోపు కోర్​కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డికి వీహెచ్ లేఖ రాశారు. తాజా రాజకీయాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

vh letter about conducting core committe meeting to uttam kumar reddy
'నెలాఖరు లోపు కోర్​కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి'
author img

By

Published : Jul 22, 2020, 9:30 PM IST

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు లోపు కోర్​కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డికి సీనియర్ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. ఇటీవల జరిగిన పీవీ నర్సింహరావు శతజయంతి వేడుకల కమిటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వీహెచ్... పార్టీ తీరుపై, కొందరు నాయకుల వ్యవహారశైలిపై చిర్రుబుర్రులాడారు. పార్టీ అంతర్గత విషయాలపై సమగ్రంగా చర్చించేందుకు కోర్​కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవట్లేనందున బుధవారం ఉత్తమ్​కుమార్​ రెడ్డికి లేఖ రాశారు.

నెలాఖరులోపు కాంగ్రెస్ కోర్​ కమిటీ సమావేశం నిర్వహించాలని.. తాజా రాజకీయాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పార్టీని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ నేతలను, శ్రేణులను మరింత బలోపేతం చేయాల్సి ఉందని వీహెచ్ పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని ఆయన లేఖలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు లోపు కోర్​కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డికి సీనియర్ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. ఇటీవల జరిగిన పీవీ నర్సింహరావు శతజయంతి వేడుకల కమిటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వీహెచ్... పార్టీ తీరుపై, కొందరు నాయకుల వ్యవహారశైలిపై చిర్రుబుర్రులాడారు. పార్టీ అంతర్గత విషయాలపై సమగ్రంగా చర్చించేందుకు కోర్​కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవట్లేనందున బుధవారం ఉత్తమ్​కుమార్​ రెడ్డికి లేఖ రాశారు.

నెలాఖరులోపు కాంగ్రెస్ కోర్​ కమిటీ సమావేశం నిర్వహించాలని.. తాజా రాజకీయాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పార్టీని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ నేతలను, శ్రేణులను మరింత బలోపేతం చేయాల్సి ఉందని వీహెచ్ పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని ఆయన లేఖలో తెలిపారు.

ఇదీ చూడండి: 'కరోనాపై తొలి నుంచీ భారత్​ స్పందన భేష్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.