ETV Bharat / state

VACCINE: మందకొడిగా వ్యాక్సినేషన్​.. ఇప్పటికీ టీకా పొందని వారు 1.05 కోట్ల మంది

author img

By

Published : Aug 7, 2021, 7:09 AM IST

Updated : Aug 7, 2021, 8:34 AM IST

తెలంగాణలో కొవిడ్‌ టీకా కార్యక్రమంలో మహానీరసం నెలకొంది. రోజు రోజుకూ ఇచ్చే టీకాల డోసులు తగ్గుముఖం పడుతున్నాయి. మూడో దశ రాకుండా ఉండాలంటే.. రాష్ట్రంలో ఒక దశలో రోజుకు 2.5 లక్షల మందికి టీకా వేశారు. అదే జోరును ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

VACCINE
టీకాల డోసులు తగ్గుముఖం

రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో రోజుకు సగటున 1.50 లక్షల డోసులను అందజేస్తున్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ఈనెల 5న 1,58,258 డోసులను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ వైద్యంలో 1,29,243 డోసులు కాగా.. ప్రైవేటులో 29,015 అందజేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన అర్హులైన టీకా లబ్ధిదారులు 2.20 కోట్ల మంది ఉండగా.. వీరిలో 1,15,24,621 మందికి తొలిడోసును, 38,21,469 మందికి రెండో డోసును అందించారు. ఇంకా ఇదే వయస్సు ఒక్క డోసూ పొందనివారు 1.05 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా. నవంబరులో తొలిడోసు పూర్తయితే.. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కొవాగ్జిన్‌ అయితే నెల తర్వాత రెండో డోసును, అదే కొవిషీల్డ్‌కు మూణ్నెల్ల వరకూ ఆగాలి. ఈ ప్రకారం డిసెంబరు-ఫిబ్రవరి నెలల వరకూ రెండో డోసు ప్రక్రియ కొనసాగుతుంది.

ఏడాది చివరి నాటికి పూర్తే లక్ష్యం

రాష్ట్రంలో ఇప్పటివరకూ అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 24.63 లక్షల మంది టీకాలు పొందారు. ఇందులో 8.32 లక్షల మంది రెండో డోసు పొందారు. రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 15.53 లక్షల మందికి తొలిడోసు వేయగా.. వీరిలో 4.85 లక్షల మంది రెండో డోసు స్వీకరించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా టీకాల పంపిణీలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ తొలి డోసును 14.91 లక్షల మందికి వేయగా.. రెండో డోసును 4.90 లక్షల మందికి వేశారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు డిసెంబరు నాటికే రెండు డోసులు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం కూడా డిసెంబరు నాటికి అందరికీ టీకా వేసేలా కార్యాచరణ రూపొందించింది.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

12 ఏళ్లు పైబడ్డ వారిని కలిపితే...

18 ఏళ్లు పైబడిన వారికి రెండు డోసులు వేయాలంటే మరో 5 నెలలు పట్టే అవకాశాలున్నాయని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. 12 ఏళ్లు దాటిన వారికి సెప్టెంబరు నుంచి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ వయస్సు వారు సుమారు 45 లక్షల మంది ఉంటారని తెలుస్తోంది. వీరికి అక్టోబరు నుంచి టీకాలను వేయడానికి ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ లెక్కన 18, 12 ఏళ్లు పైబడ్డ వారు మొత్తం 1.50 కోట్ల మందికి టీకాలను అందజేయాలి. ప్రస్తుత టీకా పంపిణీ వేగంతో ముందుకెళ్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి దాటి ఏప్రిల్‌ వరకూ పట్టే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. రాష్ట్రంలో ఒక దశలో రోజుకు 2.5 లక్షల మందికి టీకా వేశారు. అదే జోరును ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల వద్ద టీకాల నిల్వలున్నా ఒక్కో డోసుకు సుమారు రూ.1400 చెల్లించాల్సి రావడంతో.. అత్యధికులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలినాళ్లలో టీకా ధరను ప్రభుత్వమే భరించగా.. రూ.150 మాత్రమే లబ్ధిదారులు చెల్లించేవారు. ఇప్పుడు ప్రైవేటులో అదే విధానాన్ని ప్రవేశపెట్టి.. టీకాల పంపిణీని వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: VACCINE: డోసుల సంఖ్య తగ్గుతోంది.. థర్డ్​వేవ్ ముప్పు ముంచుకొస్తోంది!

రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో రోజుకు సగటున 1.50 లక్షల డోసులను అందజేస్తున్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ఈనెల 5న 1,58,258 డోసులను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ వైద్యంలో 1,29,243 డోసులు కాగా.. ప్రైవేటులో 29,015 అందజేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన అర్హులైన టీకా లబ్ధిదారులు 2.20 కోట్ల మంది ఉండగా.. వీరిలో 1,15,24,621 మందికి తొలిడోసును, 38,21,469 మందికి రెండో డోసును అందించారు. ఇంకా ఇదే వయస్సు ఒక్క డోసూ పొందనివారు 1.05 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా. నవంబరులో తొలిడోసు పూర్తయితే.. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కొవాగ్జిన్‌ అయితే నెల తర్వాత రెండో డోసును, అదే కొవిషీల్డ్‌కు మూణ్నెల్ల వరకూ ఆగాలి. ఈ ప్రకారం డిసెంబరు-ఫిబ్రవరి నెలల వరకూ రెండో డోసు ప్రక్రియ కొనసాగుతుంది.

ఏడాది చివరి నాటికి పూర్తే లక్ష్యం

రాష్ట్రంలో ఇప్పటివరకూ అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 24.63 లక్షల మంది టీకాలు పొందారు. ఇందులో 8.32 లక్షల మంది రెండో డోసు పొందారు. రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 15.53 లక్షల మందికి తొలిడోసు వేయగా.. వీరిలో 4.85 లక్షల మంది రెండో డోసు స్వీకరించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా టీకాల పంపిణీలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ తొలి డోసును 14.91 లక్షల మందికి వేయగా.. రెండో డోసును 4.90 లక్షల మందికి వేశారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు డిసెంబరు నాటికే రెండు డోసులు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం కూడా డిసెంబరు నాటికి అందరికీ టీకా వేసేలా కార్యాచరణ రూపొందించింది.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

12 ఏళ్లు పైబడ్డ వారిని కలిపితే...

18 ఏళ్లు పైబడిన వారికి రెండు డోసులు వేయాలంటే మరో 5 నెలలు పట్టే అవకాశాలున్నాయని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. 12 ఏళ్లు దాటిన వారికి సెప్టెంబరు నుంచి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ వయస్సు వారు సుమారు 45 లక్షల మంది ఉంటారని తెలుస్తోంది. వీరికి అక్టోబరు నుంచి టీకాలను వేయడానికి ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ లెక్కన 18, 12 ఏళ్లు పైబడ్డ వారు మొత్తం 1.50 కోట్ల మందికి టీకాలను అందజేయాలి. ప్రస్తుత టీకా పంపిణీ వేగంతో ముందుకెళ్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి దాటి ఏప్రిల్‌ వరకూ పట్టే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. రాష్ట్రంలో ఒక దశలో రోజుకు 2.5 లక్షల మందికి టీకా వేశారు. అదే జోరును ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల వద్ద టీకాల నిల్వలున్నా ఒక్కో డోసుకు సుమారు రూ.1400 చెల్లించాల్సి రావడంతో.. అత్యధికులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలినాళ్లలో టీకా ధరను ప్రభుత్వమే భరించగా.. రూ.150 మాత్రమే లబ్ధిదారులు చెల్లించేవారు. ఇప్పుడు ప్రైవేటులో అదే విధానాన్ని ప్రవేశపెట్టి.. టీకాల పంపిణీని వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: VACCINE: డోసుల సంఖ్య తగ్గుతోంది.. థర్డ్​వేవ్ ముప్పు ముంచుకొస్తోంది!

Last Updated : Aug 7, 2021, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.