ETV Bharat / state

కమ్యూనిస్టు పార్టీలకు లేఖలు రాసిన రాష్ట్ర కాంగ్రెస్

author img

By

Published : Mar 28, 2021, 6:31 PM IST

కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేఖలు రాసింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

bhatti, uttam
భట్టి విక్రమార్క, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖలు రాశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

లేఖలు రాయటంతో పాటు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో ఉత్తమ్​, భట్టి ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో​ కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

కాగా నాగార్జునసాగర్​ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో కాంగ్రెస్​ కాస్త ముందుంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నియోజకవర్గంలో అఖిలపక్షాలకు మంచి పట్టు ఉంది అందుకే కాంగ్రెస్​ సీపీఐ, సీపీఎం మద్దతు కోరుతోంది.

ఇదీ చదవండి: యంత్రంలో రూపాయి పెట్టు.. మాస్కు పట్టు!

సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖలు రాశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

లేఖలు రాయటంతో పాటు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో ఉత్తమ్​, భట్టి ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో​ కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

కాగా నాగార్జునసాగర్​ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో కాంగ్రెస్​ కాస్త ముందుంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నియోజకవర్గంలో అఖిలపక్షాలకు మంచి పట్టు ఉంది అందుకే కాంగ్రెస్​ సీపీఐ, సీపీఎం మద్దతు కోరుతోంది.

ఇదీ చదవండి: యంత్రంలో రూపాయి పెట్టు.. మాస్కు పట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.