రాష్ట్ర ప్రభుత్వం అన్లాక్ 4 ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈనెల 7 నుంచి హైదరాబాద్ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భౌతిక దూరం పాటించేలా చూస్తూ, శానిటైజ్ చేస్తూ మెట్రో నడుపుతామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'