ETV Bharat / state

అమ్మో 2020: మొదటి 6 నెలల్లో 207 ప్రకృతి విపత్తులు!

author img

By

Published : Sep 14, 2020, 5:04 AM IST

అసలే గోరు చుట్టు..ఆపై రోకలి పోటు అన్నట్టుగా తయారైంది ప్రపంచదేశాల పరిస్థితి. ఇప్పటికే కరోనా మహమ్మారితో అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ప్రాణ, ధన నష్టాలు చవి చూస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రకృతి విపత్తులు మరింత ఇబ్బందులు కలిగించాయి. బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టాలు.. వందల సంఖ్యలో మృతులు..! ఇదంతా ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో జరిగిన విధ్వంసం. కరోనాపై పోరాటం చేస్తూనే...ఈ ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడటానికి ఆయా దేశాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భారత్‌లోనూ ఇదే దుస్థితి. పశ్చిమ బంగలో అంఫాన్‌ తుపాను అంతా ఇంతా కాదు. కరోనా పెట్టిన పరీక్షతోనే ఆందోళన చెందుతుంటే ప్రకృతి కూడా తోడై ఇబ్బందులు తెచ్చి పెట్టటం కలవరపరుస్తోంది.

అమ్మో 2020: మొదటి 6 నెలల్లో 207 ప్రకృతి విపత్తులు!
అమ్మో 2020: మొదటి 6 నెలల్లో 207 ప్రకృతి విపత్తులు!
అమ్మో 2020: మొదటి 6 నెలల్లో 207 ప్రకృతి విపత్తులు!

సాధారణంగా ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఎప్పుడైనా ఆ సంవత్సరాన్ని తలుచుకోవటానికి కూడా ఇష్టపడరు. కానీ... 2020.. అందుకు భిన్నం. వాళ్లని వీళ్లని అని కాదు..! మొత్తం ప్రపంచాన్నే కలవరపరుస్తోంది. జనవరిలో మొదలైన కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. ఈ కరోనాతోనే సతమతం అవుతుంటే ప్రకృతి కూడా ఇప్పుడే ప్రకోపించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు 207 ప్రకృతి విపత్తులు సంభవించటం బహుశా చరిత్రలోనే ఇదే తొలిసారి. 2000-19 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముంచుకొచ్చిన విపత్తులు 185 అయితే... 2020.. 6 నెలల్లో 200కు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగటం విస్మయపరుస్తోంది. ఒక్క అమెరికాలో తప్ప దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సగటు కన్నా ఎక్కువ ప్రకృతి విపత్తులు నమోదయ్యాయి.

2019లో సంభవించిన ప్రకృతి విపత్తులతో పోల్చి చూస్తే...ఈ ఏడాది ముగియక ముందే 27% ఎక్కువగా ఇవి నమోదయ్యాయి. గతేడాది మొదటి ఆర్నెల్లలో 163 ప్రకృతి విపత్తులు అందరినీ అతలాకుతలం చేస్తే...ఈ ఏడాది ఆ సంఖ్య దాటింది. 1980 నుంచి 2019 వరకు చూసుకుంటే విపత్తుల కారణంగా వాటిల్లిన నష్టం 78 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కానీ...ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 75 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లగా అందులో 71 బిలియన్ డాలర్ల మేర ప్రకృతి విపత్తుల కారణంగానే కోతపడింది. ఏ స్థాయిలో దేశాలపై ప్రతికూల ప్రభావం పడిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మొత్తం ఆర్థిక నష్టంలో ఉత్తర అమెరికాలో సంభవించిన విపత్తుల వాటాయే 47%గా ఉంది. ఐరోపా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థిక నష్టాలు కాస్తంత తక్కువగా ఉన్నాయి.

ఈ విపత్తులతో ప్రపంచవ్యాప్తంగా 2 వేల 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 60% మేర మరణాలు వరదల కారణంగానే సంభవించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఇక్కడే వెయ్యి మంది మృతి చెందారు. కానీ...1972 నాటి నుంచి చూస్తే ప్రకృతి విపత్తుల కారణంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటితో పోల్చుకుంటే తక్కువేనని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నమోదైన మొత్తం మరణాల్లో ఆసియా-పసిఫిక్, ఆఫ్రికాల్లోనే 70% ఉన్నాయి. గతేడాది ఆఫ్రికాలో మొదటి ఆర్నెల్లలో తుపానుల కారణంగా సుమారు 2 వేల 900 మంది ప్రాణాలు కోల్పాయారు. ఉష్ణమండలాల్లో ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే...తుపానుల తీవ్రత 1-10% వరకు అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ మార్పుల అంతర్జాతీయ కమిటీ-ఐపీసీసీ పేర్కొంది. రాబోయే రోజుల్లో భూతాపాన్ని తగ్గించుకోకపోతే మరిన్ని విధ్వంసాలు చూడక తప్పదని హెచ్చరిస్తోంది.

ఆగ్నేయ అమెరికాలో తీవ్ర స్థాయిలో తుపానులు విరుచుకుపడ్డాయి. ఈస్టర్ వారాంతం సమయంలో ఈ ప్రాంతంలో టెన్నిస్ బంతుల పరిమాణంలో వడగళ్లు పడటం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఆగ్నేయ అమెరికాలోని 10 రాష్ట్రాల్లో దాదాపు 140 తుపానులు అల్లకల్లోలం చేశాయి. గంటకు 3 వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు, కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. మిస్సిసిప్పీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తుపాను సంభవించింది. మూడున్నర కిలోమీటర్ల మేర వ్యాసార్థం ఉన్న సుడిగుండం దాదాపు 100 కిలోమీటర్ల వరకు అన్నింటినీ తుడిచి పెట్టేసింది. జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపకపోవటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదు. ఈ తుపాను కారణంగా దాదాపు 3.4 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లగా..38 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాలోని కల్గరీ నగరంలో జూన్‌ 14న వడగళ్ల వాన కురిసింది. ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి.

ఉత్తర అమెరికాలో ఉరుములతో కూడిన తుపాన్ల కారణంగా 27 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇక ఆసియా విషయానికొస్తే.. భారత్‌లో అంఫాన్ తుపాను, చైనాలో వరదలతో తీవ్ర నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. మే నెలలో అంఫాన్ తుపాను కారణంగా భారత్, బంగ్లాదేశ్ అతలాకుతలమయ్యాయి. సూపర్ సైక్లోన్‌గా మారిన ఈ తుపాను బంగ్లాదేశ్‌లో గంటకు 260 కిలోమీటర్ల వేగంతో బీభత్సం సృష్టించింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు పంచుకుంటున్నందున అటు పశ్చిమ బంగలోనూ తుపాను ప్రభావం చూపించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీవ్రంగా నష్ట పరిచింది. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు విద్యుత్‌ వసతి కోల్పోయి చీకట్లోనే జీవనం సాగించాల్సి వచ్చింది. 135 మంది చనిపోగా...లక్షలాది మంది ప్రజలు ఆశ్రయం కల్పించటం కష్టతరమైంది. కరోనా ఉద్ధృతి కారణంగా ఒక చోట నుంచి మరో చోటకు తరలించటంలో సవాళ్లు ఎదురయ్యాయి. దాదాపు 15 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం కలిగించింది అంఫాన్ తుపాను. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఈ స్థాయిలో ఎప్పుడూ విపత్తు సంభవించలేదు.

చైనాలో జూన్ నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు... వరదలకు కారణమయ్యాయి. వందలాది నదులు పొంగిపొర్లాయి. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జులైలోనూ ఈ వరదల ధాటి తగ్గకపోవటం వల్ల ఆర్థిక నష్టాలను ఇప్పుడప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదు. అయితే...ప్రకృతి విపత్తుల కారణంగా భారత్, చైనా మొత్తంగా 20 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో కార్చిచ్చుల కారణంగా తీవ్ర స్థాయిలో నష్టాలు తప్పలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎప్పటి కన్నా ముందుగానే ఈ సారి కార్చిచ్చుల విధ్వంసం మొదలైంది. వాటిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా.

ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించి ఆర్థికంగా నష్టాలు చవి చూశాయి. అదే సమయంలో ప్రకృతి విపత్తులు ముంచుకు రావటం వల్ల అవి మరింత పెరిగాయి. కరోనా నుంచి కోలుకోవటమే ఎలా అని సతమతం అవుతున్న తరుణంలో ఈ ప్రమాదాలు ఆర్థిక వ్యవస్థల్ని కుంగదీశాయి. తుపానులు, వరదలు ఈ స్థాయిలో ఒకేసారి విరుచుకుపడటం చాలా అరుదైన విషయం. అదే సమయంలో ఆందోళన కలిగించే అంశం కూడా. వాతావరణ మార్పులపై దృష్టి సారించకుంటే ఏ స్థాయిలో ప్రకృతి ప్రకోపిస్తుందో తెలియజేయటానికే అన్నట్టుగా ఈ విపత్తులు సంభవించాయి. ఇప్పటికిప్పుడు భూతాపం తగ్గించటాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోకపోతే భవిష్యత్‌లోనూ ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు.

ఇదీ చదవండి: వైరస్​లు ఆశ్రయంగా చేసుకునే కొత్త అతిథులు మానవుడే..!

అమ్మో 2020: మొదటి 6 నెలల్లో 207 ప్రకృతి విపత్తులు!

సాధారణంగా ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఎప్పుడైనా ఆ సంవత్సరాన్ని తలుచుకోవటానికి కూడా ఇష్టపడరు. కానీ... 2020.. అందుకు భిన్నం. వాళ్లని వీళ్లని అని కాదు..! మొత్తం ప్రపంచాన్నే కలవరపరుస్తోంది. జనవరిలో మొదలైన కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. ఈ కరోనాతోనే సతమతం అవుతుంటే ప్రకృతి కూడా ఇప్పుడే ప్రకోపించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు 207 ప్రకృతి విపత్తులు సంభవించటం బహుశా చరిత్రలోనే ఇదే తొలిసారి. 2000-19 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముంచుకొచ్చిన విపత్తులు 185 అయితే... 2020.. 6 నెలల్లో 200కు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగటం విస్మయపరుస్తోంది. ఒక్క అమెరికాలో తప్ప దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సగటు కన్నా ఎక్కువ ప్రకృతి విపత్తులు నమోదయ్యాయి.

2019లో సంభవించిన ప్రకృతి విపత్తులతో పోల్చి చూస్తే...ఈ ఏడాది ముగియక ముందే 27% ఎక్కువగా ఇవి నమోదయ్యాయి. గతేడాది మొదటి ఆర్నెల్లలో 163 ప్రకృతి విపత్తులు అందరినీ అతలాకుతలం చేస్తే...ఈ ఏడాది ఆ సంఖ్య దాటింది. 1980 నుంచి 2019 వరకు చూసుకుంటే విపత్తుల కారణంగా వాటిల్లిన నష్టం 78 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కానీ...ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 75 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లగా అందులో 71 బిలియన్ డాలర్ల మేర ప్రకృతి విపత్తుల కారణంగానే కోతపడింది. ఏ స్థాయిలో దేశాలపై ప్రతికూల ప్రభావం పడిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మొత్తం ఆర్థిక నష్టంలో ఉత్తర అమెరికాలో సంభవించిన విపత్తుల వాటాయే 47%గా ఉంది. ఐరోపా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థిక నష్టాలు కాస్తంత తక్కువగా ఉన్నాయి.

ఈ విపత్తులతో ప్రపంచవ్యాప్తంగా 2 వేల 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 60% మేర మరణాలు వరదల కారణంగానే సంభవించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఇక్కడే వెయ్యి మంది మృతి చెందారు. కానీ...1972 నాటి నుంచి చూస్తే ప్రకృతి విపత్తుల కారణంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటితో పోల్చుకుంటే తక్కువేనని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నమోదైన మొత్తం మరణాల్లో ఆసియా-పసిఫిక్, ఆఫ్రికాల్లోనే 70% ఉన్నాయి. గతేడాది ఆఫ్రికాలో మొదటి ఆర్నెల్లలో తుపానుల కారణంగా సుమారు 2 వేల 900 మంది ప్రాణాలు కోల్పాయారు. ఉష్ణమండలాల్లో ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే...తుపానుల తీవ్రత 1-10% వరకు అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ మార్పుల అంతర్జాతీయ కమిటీ-ఐపీసీసీ పేర్కొంది. రాబోయే రోజుల్లో భూతాపాన్ని తగ్గించుకోకపోతే మరిన్ని విధ్వంసాలు చూడక తప్పదని హెచ్చరిస్తోంది.

ఆగ్నేయ అమెరికాలో తీవ్ర స్థాయిలో తుపానులు విరుచుకుపడ్డాయి. ఈస్టర్ వారాంతం సమయంలో ఈ ప్రాంతంలో టెన్నిస్ బంతుల పరిమాణంలో వడగళ్లు పడటం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఆగ్నేయ అమెరికాలోని 10 రాష్ట్రాల్లో దాదాపు 140 తుపానులు అల్లకల్లోలం చేశాయి. గంటకు 3 వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు, కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. మిస్సిసిప్పీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తుపాను సంభవించింది. మూడున్నర కిలోమీటర్ల మేర వ్యాసార్థం ఉన్న సుడిగుండం దాదాపు 100 కిలోమీటర్ల వరకు అన్నింటినీ తుడిచి పెట్టేసింది. జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపకపోవటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదు. ఈ తుపాను కారణంగా దాదాపు 3.4 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లగా..38 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాలోని కల్గరీ నగరంలో జూన్‌ 14న వడగళ్ల వాన కురిసింది. ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి.

ఉత్తర అమెరికాలో ఉరుములతో కూడిన తుపాన్ల కారణంగా 27 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇక ఆసియా విషయానికొస్తే.. భారత్‌లో అంఫాన్ తుపాను, చైనాలో వరదలతో తీవ్ర నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. మే నెలలో అంఫాన్ తుపాను కారణంగా భారత్, బంగ్లాదేశ్ అతలాకుతలమయ్యాయి. సూపర్ సైక్లోన్‌గా మారిన ఈ తుపాను బంగ్లాదేశ్‌లో గంటకు 260 కిలోమీటర్ల వేగంతో బీభత్సం సృష్టించింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు పంచుకుంటున్నందున అటు పశ్చిమ బంగలోనూ తుపాను ప్రభావం చూపించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీవ్రంగా నష్ట పరిచింది. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు విద్యుత్‌ వసతి కోల్పోయి చీకట్లోనే జీవనం సాగించాల్సి వచ్చింది. 135 మంది చనిపోగా...లక్షలాది మంది ప్రజలు ఆశ్రయం కల్పించటం కష్టతరమైంది. కరోనా ఉద్ధృతి కారణంగా ఒక చోట నుంచి మరో చోటకు తరలించటంలో సవాళ్లు ఎదురయ్యాయి. దాదాపు 15 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం కలిగించింది అంఫాన్ తుపాను. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఈ స్థాయిలో ఎప్పుడూ విపత్తు సంభవించలేదు.

చైనాలో జూన్ నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు... వరదలకు కారణమయ్యాయి. వందలాది నదులు పొంగిపొర్లాయి. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జులైలోనూ ఈ వరదల ధాటి తగ్గకపోవటం వల్ల ఆర్థిక నష్టాలను ఇప్పుడప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదు. అయితే...ప్రకృతి విపత్తుల కారణంగా భారత్, చైనా మొత్తంగా 20 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో కార్చిచ్చుల కారణంగా తీవ్ర స్థాయిలో నష్టాలు తప్పలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎప్పటి కన్నా ముందుగానే ఈ సారి కార్చిచ్చుల విధ్వంసం మొదలైంది. వాటిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా.

ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించి ఆర్థికంగా నష్టాలు చవి చూశాయి. అదే సమయంలో ప్రకృతి విపత్తులు ముంచుకు రావటం వల్ల అవి మరింత పెరిగాయి. కరోనా నుంచి కోలుకోవటమే ఎలా అని సతమతం అవుతున్న తరుణంలో ఈ ప్రమాదాలు ఆర్థిక వ్యవస్థల్ని కుంగదీశాయి. తుపానులు, వరదలు ఈ స్థాయిలో ఒకేసారి విరుచుకుపడటం చాలా అరుదైన విషయం. అదే సమయంలో ఆందోళన కలిగించే అంశం కూడా. వాతావరణ మార్పులపై దృష్టి సారించకుంటే ఏ స్థాయిలో ప్రకృతి ప్రకోపిస్తుందో తెలియజేయటానికే అన్నట్టుగా ఈ విపత్తులు సంభవించాయి. ఇప్పటికిప్పుడు భూతాపం తగ్గించటాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోకపోతే భవిష్యత్‌లోనూ ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు.

ఇదీ చదవండి: వైరస్​లు ఆశ్రయంగా చేసుకునే కొత్త అతిథులు మానవుడే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.