ETV Bharat / state

ఏడాదిలో రెండు అగ్నిప్రమాదాలు... కారణాలు ఏమై ఉంటాయి..? - train accidents in telangana 2020

రైలు బోగీలు తగులబడుతున్న ఘటనలు రైల్వే భద్రతపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాదిలో రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ రెండు ప్రమాదాలు ఆగివున్న రైళ్లలోనే జరగడం విశేషం. ఇంతకీ ఈ ఘటనలు ఆకతాయిల చేష్టల వల్ల జరుగుతున్నాయా? లేక విద్యుదాఘాతం వల్ల చోటు చేసుకుంటున్నాయా..? అనేది తేలాల్సి ఉంది.

ఏడాదిలో రెండు అగ్నిప్రమాదాలు... కారణాలు ఏమై ఉంటాయి..?
ఏడాదిలో రెండు అగ్నిప్రమాదాలు... కారణాలు ఏమై ఉంటాయి..?
author img

By

Published : Nov 4, 2020, 5:30 PM IST

దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ రైల్వే. రైల్వే శాఖ అంటే.. అత్యంత సురక్షితమని ప్రయాణికులు భావిస్తుంటారు. రాను రాను రైల్వేశాఖపై ఆ అభిప్రాయం మారిపోతుంది. ఇటీవలి కాలంలో ఆగివున్న రైల్వే బోగీల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది కాలంలో రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇంతకీ అవి ఎలా జరుగుతున్నాయి.. అనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు.

అప్పుడు అలా...

ఈ ఏడాది మార్చిలో మౌలాలీ రైల్వే స్టేషన్​లో రైలులో అగ్నిప్రమాదం జరిగింది. మార్చి 13న కాకినాడటౌన్‌ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలును రాత్రివేళలో మౌలాలీ రైల్వేస్టేషన్​లో నిలిపారు. మూడు బోగీలను మరమ్మతు నిమిత్తం తరలించేందుకు అదే రైలుకు తగిలించారు. మార్చి 14న ఆ బోగీల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బోగీల తలుపులు తెరిచి ఉండడం వల్ల గుర్తు తెలియని దుండగులు బోగీల్లోకి చొరబడినట్లు రైల్వేశాఖ విచారణలో తేలింది. ఘటనా స్థలం నుంచి సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టె ఆనవాళ్లు సేకరించారు. ఇప్పటీకీ ఈ ఘటనపై అధికారికంగా నోరువిప్పడంలేదు.

ఇప్పుడు ఇలా...

తాజాగా మేడ్చల్‌ రైల్వే స్టేషన్ సమీపంలో కొంతకాలంగా నిలిపి ఉంచిన పుష్‌పుల్‌ పాసింజర్ రైలుబోగిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గత 10 రోజులుగా ఈ బోగీలను ఇక్కడే నిలిపి ఉంచామని.. దీనికి ఇంజిన్ కూడా లేదని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బోగీల నుంచి పొగలు రావడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది... ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి కారణం గుర్తు తెలియని దుండగులా.. విద్యుదాఘాతమా అనేది తేలాల్సి ఉంది.

అధికారుల అలసత్వం వల్లనే..

గతంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ప్రమాదాలపై దృష్టిసారించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.

ఇదీ చూడండి: మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ రైల్వే. రైల్వే శాఖ అంటే.. అత్యంత సురక్షితమని ప్రయాణికులు భావిస్తుంటారు. రాను రాను రైల్వేశాఖపై ఆ అభిప్రాయం మారిపోతుంది. ఇటీవలి కాలంలో ఆగివున్న రైల్వే బోగీల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది కాలంలో రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇంతకీ అవి ఎలా జరుగుతున్నాయి.. అనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు.

అప్పుడు అలా...

ఈ ఏడాది మార్చిలో మౌలాలీ రైల్వే స్టేషన్​లో రైలులో అగ్నిప్రమాదం జరిగింది. మార్చి 13న కాకినాడటౌన్‌ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలును రాత్రివేళలో మౌలాలీ రైల్వేస్టేషన్​లో నిలిపారు. మూడు బోగీలను మరమ్మతు నిమిత్తం తరలించేందుకు అదే రైలుకు తగిలించారు. మార్చి 14న ఆ బోగీల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బోగీల తలుపులు తెరిచి ఉండడం వల్ల గుర్తు తెలియని దుండగులు బోగీల్లోకి చొరబడినట్లు రైల్వేశాఖ విచారణలో తేలింది. ఘటనా స్థలం నుంచి సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టె ఆనవాళ్లు సేకరించారు. ఇప్పటీకీ ఈ ఘటనపై అధికారికంగా నోరువిప్పడంలేదు.

ఇప్పుడు ఇలా...

తాజాగా మేడ్చల్‌ రైల్వే స్టేషన్ సమీపంలో కొంతకాలంగా నిలిపి ఉంచిన పుష్‌పుల్‌ పాసింజర్ రైలుబోగిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గత 10 రోజులుగా ఈ బోగీలను ఇక్కడే నిలిపి ఉంచామని.. దీనికి ఇంజిన్ కూడా లేదని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బోగీల నుంచి పొగలు రావడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది... ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి కారణం గుర్తు తెలియని దుండగులా.. విద్యుదాఘాతమా అనేది తేలాల్సి ఉంది.

అధికారుల అలసత్వం వల్లనే..

గతంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ప్రమాదాలపై దృష్టిసారించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.

ఇదీ చూడండి: మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.