పర్వతారోహకుడు ఆమ్గోత్ తుకారాం ఏడోసారి పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఇప్పటి వరకు భారత్లోని నోర్బూ, రుదుగారియా, స్టాకాంగ్రీ పర్వతాలతో పాటు... ఆఫ్రికాలోని కిలిమాంజారో, ఎవరెస్ట్, యూరోప్ ఖండంలోని ఎల్బ్రూస్ పర్వతాలను అధిరోహించిన తుకారం ఇప్పుడు దక్షిణ అమెరికాలోని మౌంట్ అకాన్గోగాను అధిరోహించేందుకు పూనుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రిదండి అహోబిల రామానుజ జీయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమ్గోద్ తుకారాంకు చిన్న జీయర్ స్వామి తరఫున ఆర్థిక సాయం అందించారు. దేశానికి వన్నె తెచ్చే పనులను యువత ఉత్సాహంగా చేస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాలని చిన్నజీయర్ పేర్కొన్నారు. తనను గేలి చేనివారికి... తన గెలుపే సమాధానంగా నిలిచిందని తుకారాం పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో జనాభా కంటే.. ఆధార్ కార్డులే ఎక్కువట.?