ETV Bharat / state

గోవధపై హైదరాబాద్ సీపీని కలిసిన టీటీడీ బోర్డు సభ్యుడు

హిందువుకు అత్యంత పవిత్రమైన గోవులను వధించకుండా చూడాలని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్​ అంజనీకుమార్​కు టీటీడి బోర్డు సభ్యుడు కె. శివకుమార్ వినతి పత్రం అందించారు. గోమాత రక్షణ కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Jul 30, 2020, 1:52 PM IST

ttd member meet hyderabad cp anjani kumar
గోవధపై హైదరాబాద్ సీపీని కలిసిన టీటీడీ బోర్డు సభ్యుడు

గోవధపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​ను టీటీడీ బోర్డు సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె. శివకుమార్ కలిశారు. సీపీ కార్యాలయానికి వెళ్లి... దూడలు, ఎద్దులు అక్రమ వధపై చర్చించారు. నగరంలో గోవుల అక్రమ రవాణ, గోవధ జరగకుండా చూడాలని సీపీకి... శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

గోవులను హత్య చేస్తే వారి పైన యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్​లో అనేక ఆవులు వధించడానికి తీసుకొచ్చారని... అలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం సీపీకి వినతి పత్రం అందించారు.

గోవధపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​ను టీటీడీ బోర్డు సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె. శివకుమార్ కలిశారు. సీపీ కార్యాలయానికి వెళ్లి... దూడలు, ఎద్దులు అక్రమ వధపై చర్చించారు. నగరంలో గోవుల అక్రమ రవాణ, గోవధ జరగకుండా చూడాలని సీపీకి... శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

గోవులను హత్య చేస్తే వారి పైన యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్​లో అనేక ఆవులు వధించడానికి తీసుకొచ్చారని... అలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం సీపీకి వినతి పత్రం అందించారు.

ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.