ETV Bharat / state

'భారత్​ బంద్​'కు ఆర్టీసీ సంఘాల మద్దతు

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు రేపు భారత్​ బంద్​కు పిలుపునిచ్చారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంఘాలు మద్దతు తెలిపాయి.

author img

By

Published : Dec 7, 2020, 5:42 PM IST

TSRTC
'భారత్​ బంద్​'కు ఆర్టీసీ సంఘాల మద్దతు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే రేపు భారత్​ బంద్​కు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు.. పలు ఆర్టీసీ సంఘాలు తమ మద్దతును తెలుపుతున్నాయి.

తెలంగాణ మజ్దూర్​ యూనియన్​ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్​రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్​ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఎస్​డబ్ల్యూఎఫ్​ ప్రధాన కార్యదర్శి వీఎస్​రావులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. డిపోల ముందు నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. మిగిలిన యూనియన్లు విధుల్లో పాల్గొంటూనే నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే రేపు భారత్​ బంద్​కు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు.. పలు ఆర్టీసీ సంఘాలు తమ మద్దతును తెలుపుతున్నాయి.

తెలంగాణ మజ్దూర్​ యూనియన్​ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్​రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్​ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఎస్​డబ్ల్యూఎఫ్​ ప్రధాన కార్యదర్శి వీఎస్​రావులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. డిపోల ముందు నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. మిగిలిన యూనియన్లు విధుల్లో పాల్గొంటూనే నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించాయి.

ఇదీ చూడండి:- సాగు చట్టాలపై విపక్షాలు గరం​- భాజపా ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.