ETV Bharat / state

TSRTC merging with government : ప్రభుత్వంలో TSRTC విలీనం.. కొలిక్కివచ్చిన బిల్లు రూపకల్పన.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పువ్వాడ

TSRTC merging with government Bill in Assembly Sessions 2023 : ప్రభుత్వంలో ​ఆర్టీసీనీ విలీనం చేస్తామన్న సీఎం కేసీఆర్​ ప్రకటన, మంత్రివర్గ తీర్మానం నేపథ్యంలో తదుపరి చర్యలు మొదలయ్యాయి. విలీనానికి సంబంధించిన బిల్లు రూపకల్పన ప్రారంభమైంది. గురువారం ప్రారంభం అవుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.

author img

By

Published : Aug 2, 2023, 7:57 AM IST

Updated : Aug 2, 2023, 9:09 AM IST

RTC bill
RTC bill
కొలిక్కివచ్చిన బిల్లు రూపకల్పన.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పువ్వాడ

TSRTC merging with government Bill : ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనానికి బిల్లు రూపకల్పన ప్రక్రియ మొదలైంది. ఈ బిల్లులో చేర్చాల్సిన అంశాలను ఆర్టీసీ అధికారులు దాదాపు కొలిక్కి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్టీసీకి వచ్చే ఆదాయంపై రెండేళ్ల పాటు ప్రభుత్వం మారిటోరియం ఇవ్వనుందని తెలిసింది. అంటే.. ఆ ఆదాయంలో ప్రభుత్వం ఏమీ తీసుకోదు. సంస్థ అవసరాలకే వినియోగించుకోవచ్చు.

TSRTC merging with government Bill : అదే సమయంలో.. చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రెండేళ్ల తర్వాత మాత్రం ప్రతి నెలా సంస్థ ఆదాయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మిగిలిన 75 శాతం ఆదాయాన్ని బస్సుల నిర్వహణ, డీజిల్, ఇతర ఖర్చులకు వినియోగించుకోవచ్చు. ఈ అంశాలను బిల్లులో చేరుస్తున్నారు. రేపు ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

TSRTC merging with government Bill in Assembly : ప్రస్తుతం సంస్థకు సగటున నెలకు 471 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఉద్యోగులకు వేతనాలు, పీఎఫ్​ వాటా చెల్లింపు, పింఛన్లు కలిపి ప్రతి నెల 251 కోట్ల మేర ఖర్చవుతోంది. ఉమ్మడి ఆర్టీసీకి సంబంధించిన విభజన ప్రక్రియ, ముఖ్యంగా ఆస్తుల పంపకాలు జరగలేదు. సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కార్పొరేషన్‌ను యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

TSRTC Merging Bill in Telangana Assembly Sessions : ఆర్టీసీ బస్‌స్టేషన్లు, భూములు, బస్సులు.. కార్పొరేషన్‌ పరిధిలోనే ఉంటాయి. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో అక్కడ అనుసరించిన విధానాలపై సమాచారాన్ని సైతం టీఎస్​ఆర్టీసీ తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. టీఎస్​ఆర్టీసీ ఆవిర్భవించినప్పుడు 57,177 మంది ఉద్యోగులు ఉన్నారు. 13,800 మంది రిటైర్‌ కాగా.. ప్రస్తుతం 43,377 మంది పనిచేస్తున్నారని సంస్థ... ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో 96 బస్‌ డిపోలు, 9,181 బస్సులు ఉన్నట్లు తెలిపింది. బస్సుల్లో సొంతవి 6,415 కాగా.. అద్దెవి 2,766 ఉన్నాయని, అన్నీ కలిపి రోజుకు సగటున 32.59 లక్షల కిలో మీటర్లు తిరుగుతున్నాయని సంస్థ పేర్కొంది.

నిజాం హయాంలో ఆవిర్భావం.. దేశంలోనే మొదటిసారిగా 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైన సంస్థను నవంబర్‌ 1, 1951లో హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం... 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి :

కొలిక్కివచ్చిన బిల్లు రూపకల్పన.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పువ్వాడ

TSRTC merging with government Bill : ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనానికి బిల్లు రూపకల్పన ప్రక్రియ మొదలైంది. ఈ బిల్లులో చేర్చాల్సిన అంశాలను ఆర్టీసీ అధికారులు దాదాపు కొలిక్కి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్టీసీకి వచ్చే ఆదాయంపై రెండేళ్ల పాటు ప్రభుత్వం మారిటోరియం ఇవ్వనుందని తెలిసింది. అంటే.. ఆ ఆదాయంలో ప్రభుత్వం ఏమీ తీసుకోదు. సంస్థ అవసరాలకే వినియోగించుకోవచ్చు.

TSRTC merging with government Bill : అదే సమయంలో.. చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రెండేళ్ల తర్వాత మాత్రం ప్రతి నెలా సంస్థ ఆదాయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మిగిలిన 75 శాతం ఆదాయాన్ని బస్సుల నిర్వహణ, డీజిల్, ఇతర ఖర్చులకు వినియోగించుకోవచ్చు. ఈ అంశాలను బిల్లులో చేరుస్తున్నారు. రేపు ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

TSRTC merging with government Bill in Assembly : ప్రస్తుతం సంస్థకు సగటున నెలకు 471 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఉద్యోగులకు వేతనాలు, పీఎఫ్​ వాటా చెల్లింపు, పింఛన్లు కలిపి ప్రతి నెల 251 కోట్ల మేర ఖర్చవుతోంది. ఉమ్మడి ఆర్టీసీకి సంబంధించిన విభజన ప్రక్రియ, ముఖ్యంగా ఆస్తుల పంపకాలు జరగలేదు. సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కార్పొరేషన్‌ను యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

TSRTC Merging Bill in Telangana Assembly Sessions : ఆర్టీసీ బస్‌స్టేషన్లు, భూములు, బస్సులు.. కార్పొరేషన్‌ పరిధిలోనే ఉంటాయి. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో అక్కడ అనుసరించిన విధానాలపై సమాచారాన్ని సైతం టీఎస్​ఆర్టీసీ తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. టీఎస్​ఆర్టీసీ ఆవిర్భవించినప్పుడు 57,177 మంది ఉద్యోగులు ఉన్నారు. 13,800 మంది రిటైర్‌ కాగా.. ప్రస్తుతం 43,377 మంది పనిచేస్తున్నారని సంస్థ... ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో 96 బస్‌ డిపోలు, 9,181 బస్సులు ఉన్నట్లు తెలిపింది. బస్సుల్లో సొంతవి 6,415 కాగా.. అద్దెవి 2,766 ఉన్నాయని, అన్నీ కలిపి రోజుకు సగటున 32.59 లక్షల కిలో మీటర్లు తిరుగుతున్నాయని సంస్థ పేర్కొంది.

నిజాం హయాంలో ఆవిర్భావం.. దేశంలోనే మొదటిసారిగా 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైన సంస్థను నవంబర్‌ 1, 1951లో హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం... 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Aug 2, 2023, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.