గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 187 మందిని ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సొసైటీల్లోని స్కూళ్లలో 303 ఉద్యోగాల భర్తీ కోసం 2018 మే 14న రాత పరీక్ష నిర్వహించింది.
మూడు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 187 మంది అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఉద్యోగాల్లో చేరే ఆసక్తి లేనివారు ఈ నెల 4, 5 తేదీల్లో రీలింక్విష్మెంట్ ఇవ్వాలని అభ్యర్థులను టీఎస్పీఎస్సీ కోరింది.