ఈసెట్ అభ్యర్థులు వెబ్సైట్ నుంచి సవరించిన కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 25 నుంచి కొత్త హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త హాల్ టికెట్లనే పరీక్షా కేంద్రాల్లో చూపించాలని కన్వీనర్ తెలిపారు.
ఆగస్టు 31న ఆన్లైన్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ సెట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 52, ఏపీలో నాలుగు కేంద్రాల్లో ఎంట్రెన్స్ ఉంటుందన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆన్లైన్ పరీక్షపై గ్రామీణ విద్యార్థులకు మాక్టెస్ట్ నిర్వహించనున్నట్లు మంజూర్ హుస్సేన్ తెలిపారు.