ETV Bharat / state

Maareddy: అంచనాలకు మించి ధాన్యం దిగుబడి : మారెడ్డి

author img

By

Published : Jun 7, 2021, 7:11 PM IST

యాసంగి సీజన్​లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఇప్పటికే దాదాపు 82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వెల్లడించాారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తి చేశామని.. ఇంకా గ్రామాల్లో రెండుశాతం ధాన్యం మాత్రమే మిగిలి ఉందన్నారు.

TS civil supplies  Chairman Maa Reddy srinivasa redd
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి

రాష్ట్రంలో వరి సాగు, దిగుబడులు, కొనుగోళ్లల్లో సరికొత్త రికార్డు నమోదైందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. యాసంగి సీజన్‌లో లక్ష్యానికి మించి ధాన్యం సేకరించామన్నారు. 19 జిల్లాల్లో 100 శాతంపైగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌లో ఆయన మాట్లాడారు.


భారత ఆహార సంస్థకు అప్పగించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి ఇప్పటి వరకు 82 లక్షల మెట్రిక్ టన్నులు.. 101 శాతం మేర కొనుగోలు చేశామని వివరించారు. పన్నెండున్నర లక్షల మంది రైతుల నుంచి 6 వేల 962 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని మారెడ్డి పేర్కొన్నారు. 16 వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని... ఇంకా 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని మారెడ్డి వివరించారు.

ఇదీ చూడండి: పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ

రాష్ట్రంలో వరి సాగు, దిగుబడులు, కొనుగోళ్లల్లో సరికొత్త రికార్డు నమోదైందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. యాసంగి సీజన్‌లో లక్ష్యానికి మించి ధాన్యం సేకరించామన్నారు. 19 జిల్లాల్లో 100 శాతంపైగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌లో ఆయన మాట్లాడారు.


భారత ఆహార సంస్థకు అప్పగించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి ఇప్పటి వరకు 82 లక్షల మెట్రిక్ టన్నులు.. 101 శాతం మేర కొనుగోలు చేశామని వివరించారు. పన్నెండున్నర లక్షల మంది రైతుల నుంచి 6 వేల 962 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని మారెడ్డి పేర్కొన్నారు. 16 వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని... ఇంకా 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని మారెడ్డి వివరించారు.

ఇదీ చూడండి: పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.