ETV Bharat / state

ఎంపీ అర్వింద్​కు తెరాస ఎంపీల సవాల్​

author img

By

Published : Feb 6, 2020, 7:47 PM IST

పసుపు బోర్టు తీసుకొస్తానని బాండ్‌ రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పూర్తిగా విఫలమయ్యారని తెరాస ఎంపీలు విమర్శించారు. పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి 100 కోట్ల నిధులను విడుదల చేయించాలని సవాల్ విసిరారు.‍‌

trs-mps-badugula-lingaiah-and-banda-prakash-challenge-to-mp-arvind
ఎంపీ అర్వింద్​కు తెరాస ఎంపీలు సవాల్​

పసుపు బోర్టు తీసుకొస్తానని బాండ్‌ రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ... పూర్తిగా విఫలమయ్యారని తెరాస ఎంపీలు విమర్శించారు. డివిజన్​ కార్యాలయాన్ని రీజినల్​ కార్యాలయంగా మాత్రమే మార్చారని తెరాస రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్​ ఆరోపించారు. భాజపా నేతలు పసుపు పంటకు కనీస మద్దతు ధర తీసుకురావాలని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమ పథకాలు ఆపాలని భాజపా ఎంపీలు, ఫార్మాసిటీ ఆపాలని కాంగ్రెస్​ ఎంపీలు చూస్తున్నారని మరో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూడటం బాధాకరమని అన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్ల నిధులు విడుదల చేయించాలని సవాల్​ విసిరారు.

ఎంపీ అర్వింద్​కు తెరాస ఎంపీలు సవాల్​

ఇదీ చూడండి: 'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట!

పసుపు బోర్టు తీసుకొస్తానని బాండ్‌ రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ... పూర్తిగా విఫలమయ్యారని తెరాస ఎంపీలు విమర్శించారు. డివిజన్​ కార్యాలయాన్ని రీజినల్​ కార్యాలయంగా మాత్రమే మార్చారని తెరాస రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్​ ఆరోపించారు. భాజపా నేతలు పసుపు పంటకు కనీస మద్దతు ధర తీసుకురావాలని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమ పథకాలు ఆపాలని భాజపా ఎంపీలు, ఫార్మాసిటీ ఆపాలని కాంగ్రెస్​ ఎంపీలు చూస్తున్నారని మరో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూడటం బాధాకరమని అన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్ల నిధులు విడుదల చేయించాలని సవాల్​ విసిరారు.

ఎంపీ అర్వింద్​కు తెరాస ఎంపీలు సవాల్​

ఇదీ చూడండి: 'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.