ETV Bharat / state

మేయర్ పీఠమే లక్ష్యంగా తెరాస ప్రచార హోరు

author img

By

Published : Nov 22, 2020, 7:31 PM IST

జీహెచ్​ఎంసీ పీఠంపై గులాబీజెండా ఎగురవేయడమే లక్ష్యంగా అధికార తెరాస అభ్యర్థులు, నేతలు ప్రచార హోరును పెంచారు. అన్నిపార్టీల కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేసిన కారుపార్టీ వ్యుహాత్మకంగా ముఖ్యనేతల్ని రంగంలోకి దించింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రస్తావిస్తూ ఇంటింటికెళ్లి తెరాస అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు. విపక్షాలకు అవకాశమిస్తే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందని మంత్రులు విమర్శించారు.

trs
trs
మేయర్ పీఠమే లక్ష్యంగా తెరాస ప్రచార హోరు

బల్దియా ఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థులు దూసుకెళుతున్నారు. ప్రచారానికి తక్కువ రోజుల వ్యవధి ఉండడంతో సాధ్యమైనంతగా ఓటర్లను నేరుగా కలుసుకునేలా ప్రణాళిక అమలుచేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన పనులను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బరిలో దిగారు. మేయర్‌ పీఠం కైవసమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

వంద సీట్లు ఖాయం

అడిక్‌మెట్‌ అభ్యర్థి హేమలతకు మద్దతుగా నాగమయ్య కుంట, మేడిబాయ్‌ బస్తీ ప్రాంతాల్లో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాంనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి... శ్రీరామ్‌నగర్‌, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి ఓటేయాలని అభ్యర్థించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మంగళ్‌హాట్ డివిజన్ అభ్యర్థి పరమేశ్వరి సింగ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

ప్రచార హోరు

సికింద్రాబాద్‌ సెగ్మెంట్‌ రాంగోపాల్ పేట్ డివిజన్‌లో అధికార పార్టీ అభ్యర్థి అరుణ... మెక్లెంగూడ, చుట్టాల బస్తీ తదితరచోట్ల ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి పాదయాత్రగా వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పటాన్‌చెరు అభ్యర్థి మెట్టు కుమార్‌.... తనకు మద్దతిస్తే మరింత పనిచేస్తానంటూ ఓట్లు అడుగుతున్నారు. అల్వాల్ యాదమ్మ నగర్, కృష్ణ ఎనక్లేవ్‌ పాటు పలు కాలనీల్లో డివిజన్‌ ఇంఛార్జీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అభ్యర్థి విజయశాంతి ప్రచారం చేశారు.

పనులు చూసి ఓటేయండి

సికింద్రాబాద్ పరిధి బౌద్ధనగర్‌లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఉపసభాపతి పద్మారావుగౌడ్‌ పాదయాత్రగా వెళ్లి బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వం చేసిన పనులు చూసి ఓటేయాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలే తెరాసను గెలిపిస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ స్పష్టం చేశారు. కేపీహెచ్​బీ కాలనీ తెరాస అభ్యర్థి మందడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రామచంద్రాపూర్‌ డివిజన్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని అభ్యర్థి పుష్ప కోరారు.

వారికి బుద్ధి చెప్పాలి

గుడిమల్కాపూర్‌ డివిజన్‌ పరిధిలోని వడ్డెర బస్తీ, టెలికం కాలనీ, జాఫర్‌గూడలో ఇంటింటికి తిరిగి అభ్యర్థి ప్రకాశ్‌ ఓటేయాలని కోరారు. మెట్టుగూడ ఆలుగడ్డ బావి ప్రాంతంలో తెరాస అభ్యర్థి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ కోరారు. సనత్ నగర్ డివిజన్ అల్లావుద్దీన్ కోటలో తెరాస అభ్యర్థి కొలను లక్ష్మీరెడ్డికి తరఫున ప్రచారం చేశారు.

అఖండ విజయం సాధిస్తాం

హైదరాబాద్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బన్సీలాల్ పేట తెరాస అభ్యర్థి హేమలతకు మద్దతుగా మంత్రి తలసాని బస్తీల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. విపక్షాలకు దిమ్మతిరిగిపోయాలే అఖండ విజయం అందిస్తారని తలసాని విశ్వాసం వ్యక్తం చేశారు. హస్తినాపురం తెరాస అభ్యర్థి రమావత్‌ పద్మ నాయక్‌ గెలుపునకు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గడపగడపకు వెళ్లి చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించాలని సూచించారు.

ఇంటింటికి

తార్నాకలో ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెరాస అభ్యర్థి మోతి శ్రీలత రెడ్డి వెల్లడించారు. బీఎన్​ రెడ్డి నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి ముద్దగోని లక్ష్మీ ప్రసన్న ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారపర్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుడి నడిపిస్తున్నారు.

ఇదీ చదవండి : రెండునెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టగలం: ఎంఐఎం ఎమ్మెల్యే

మేయర్ పీఠమే లక్ష్యంగా తెరాస ప్రచార హోరు

బల్దియా ఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థులు దూసుకెళుతున్నారు. ప్రచారానికి తక్కువ రోజుల వ్యవధి ఉండడంతో సాధ్యమైనంతగా ఓటర్లను నేరుగా కలుసుకునేలా ప్రణాళిక అమలుచేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన పనులను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బరిలో దిగారు. మేయర్‌ పీఠం కైవసమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

వంద సీట్లు ఖాయం

అడిక్‌మెట్‌ అభ్యర్థి హేమలతకు మద్దతుగా నాగమయ్య కుంట, మేడిబాయ్‌ బస్తీ ప్రాంతాల్లో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాంనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి... శ్రీరామ్‌నగర్‌, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి ఓటేయాలని అభ్యర్థించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మంగళ్‌హాట్ డివిజన్ అభ్యర్థి పరమేశ్వరి సింగ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

ప్రచార హోరు

సికింద్రాబాద్‌ సెగ్మెంట్‌ రాంగోపాల్ పేట్ డివిజన్‌లో అధికార పార్టీ అభ్యర్థి అరుణ... మెక్లెంగూడ, చుట్టాల బస్తీ తదితరచోట్ల ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి పాదయాత్రగా వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పటాన్‌చెరు అభ్యర్థి మెట్టు కుమార్‌.... తనకు మద్దతిస్తే మరింత పనిచేస్తానంటూ ఓట్లు అడుగుతున్నారు. అల్వాల్ యాదమ్మ నగర్, కృష్ణ ఎనక్లేవ్‌ పాటు పలు కాలనీల్లో డివిజన్‌ ఇంఛార్జీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అభ్యర్థి విజయశాంతి ప్రచారం చేశారు.

పనులు చూసి ఓటేయండి

సికింద్రాబాద్ పరిధి బౌద్ధనగర్‌లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఉపసభాపతి పద్మారావుగౌడ్‌ పాదయాత్రగా వెళ్లి బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వం చేసిన పనులు చూసి ఓటేయాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలే తెరాసను గెలిపిస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ స్పష్టం చేశారు. కేపీహెచ్​బీ కాలనీ తెరాస అభ్యర్థి మందడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రామచంద్రాపూర్‌ డివిజన్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని అభ్యర్థి పుష్ప కోరారు.

వారికి బుద్ధి చెప్పాలి

గుడిమల్కాపూర్‌ డివిజన్‌ పరిధిలోని వడ్డెర బస్తీ, టెలికం కాలనీ, జాఫర్‌గూడలో ఇంటింటికి తిరిగి అభ్యర్థి ప్రకాశ్‌ ఓటేయాలని కోరారు. మెట్టుగూడ ఆలుగడ్డ బావి ప్రాంతంలో తెరాస అభ్యర్థి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ కోరారు. సనత్ నగర్ డివిజన్ అల్లావుద్దీన్ కోటలో తెరాస అభ్యర్థి కొలను లక్ష్మీరెడ్డికి తరఫున ప్రచారం చేశారు.

అఖండ విజయం సాధిస్తాం

హైదరాబాద్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బన్సీలాల్ పేట తెరాస అభ్యర్థి హేమలతకు మద్దతుగా మంత్రి తలసాని బస్తీల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. విపక్షాలకు దిమ్మతిరిగిపోయాలే అఖండ విజయం అందిస్తారని తలసాని విశ్వాసం వ్యక్తం చేశారు. హస్తినాపురం తెరాస అభ్యర్థి రమావత్‌ పద్మ నాయక్‌ గెలుపునకు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గడపగడపకు వెళ్లి చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించాలని సూచించారు.

ఇంటింటికి

తార్నాకలో ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెరాస అభ్యర్థి మోతి శ్రీలత రెడ్డి వెల్లడించారు. బీఎన్​ రెడ్డి నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి ముద్దగోని లక్ష్మీ ప్రసన్న ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారపర్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుడి నడిపిస్తున్నారు.

ఇదీ చదవండి : రెండునెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టగలం: ఎంఐఎం ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.