ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @1PM

author img

By

Published : Jun 5, 2020, 1:03 PM IST

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news till now
టాప్​ 10 న్యూస్ @1PM

జలసౌధలో సమావేశం

హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో గోదావరి నది బోర్డు భేటీ అయింది. ఈఎన్‌సీ ప్రాజెక్టుల డీపీఆర్‌లు, టెలిమెట్రీ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.

సీఎస్ కాన్వాయ్ అడ్డగింత

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులకు పరిశీలించేందుకు సీఎస్​ సోమేశ్​కుమార్​ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. సదాశివనగర్​ మండలంలోని తిర్మన్​పల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం సీఎస్​ గర్గుల్​ గ్రామానికి వెళ్తుండగా ఓ రైతు సీఎస్​ కాన్వాయ్​ని అడ్డుకున్నాడు. ఎందుకు అడ్డుకున్నాడంటే..?

50 తులాల బంగారం చోరీ

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా రాఘవేంద్ర హిల్స్​ కాలనీలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.95 వేల నగదు, 50 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఏం జరిగిందంటే...

హైకోర్టు సమ్మతించింది

ఆసుపత్రి నుంచి డిశ్చార్జికి విశాఖ వైద్యుడు సుధాకర్​కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఆయన ఎప్పుడైనా వెళ్లొచ్చని సూచించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది. ఇంకేమన్నదంటే...

తిరుమలలో జ్యేష్ఠాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజుల‌పాటు వేడుకలు నిర్వహిస్తారు. నేడు ఏమి చేశారంటే?

బండరాయితో.. కిరాతకంగా..

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అల్జాపూర్​లో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఏనుగు మృతి కేసులో పురోగతి

కేరళ మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన కేసులో అటవీశాఖ అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ఈ మేరకు కేరళ అటవీ శాఖ మంత్రి కే రాజు వెల్లడించారు. ఇంకేమన్నారంటే...

బ్రెజిల్​లో కరోనా విజృంభణ..

బ్రెజిల్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 1,473మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే?

విక్రయాలు షురూ

భారత మార్కెట్​లోకి శాంసంగ్ గెలాక్సీ ఏ -31 వచ్చేసింది. గెలాక్సీ ఏ -30 కొనసాగింపుగా ఈ మోడల్​ ఫీచర్లను తీసుకువచ్చారు. ధరలు ఎలా ఉన్నాయంటే..?

అత్యుత్తమం​ ఎవరంటే..?

లసిత్​ మలింగ, జస్ప్రీత్​ బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్​లో పదునైన యార్కర్లు వేయగలిగిన ప్రతిభావంతులు. వీరిద్దరు తమ ప్రదర్శనతో జట్టు బౌలింగ్ దళానికి వెన్నెముకగా నిలుస్తున్నారు. అలాంటి ఈ జోడి ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో ఒకే జట్టు తరఫున ఆడుతోంది. దీనిపై బుమ్రా ఏమన్నాడంటే?

జలసౌధలో సమావేశం

హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో గోదావరి నది బోర్డు భేటీ అయింది. ఈఎన్‌సీ ప్రాజెక్టుల డీపీఆర్‌లు, టెలిమెట్రీ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.

సీఎస్ కాన్వాయ్ అడ్డగింత

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులకు పరిశీలించేందుకు సీఎస్​ సోమేశ్​కుమార్​ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. సదాశివనగర్​ మండలంలోని తిర్మన్​పల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం సీఎస్​ గర్గుల్​ గ్రామానికి వెళ్తుండగా ఓ రైతు సీఎస్​ కాన్వాయ్​ని అడ్డుకున్నాడు. ఎందుకు అడ్డుకున్నాడంటే..?

50 తులాల బంగారం చోరీ

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా రాఘవేంద్ర హిల్స్​ కాలనీలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.95 వేల నగదు, 50 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఏం జరిగిందంటే...

హైకోర్టు సమ్మతించింది

ఆసుపత్రి నుంచి డిశ్చార్జికి విశాఖ వైద్యుడు సుధాకర్​కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఆయన ఎప్పుడైనా వెళ్లొచ్చని సూచించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది. ఇంకేమన్నదంటే...

తిరుమలలో జ్యేష్ఠాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజుల‌పాటు వేడుకలు నిర్వహిస్తారు. నేడు ఏమి చేశారంటే?

బండరాయితో.. కిరాతకంగా..

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అల్జాపూర్​లో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఏనుగు మృతి కేసులో పురోగతి

కేరళ మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన కేసులో అటవీశాఖ అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ఈ మేరకు కేరళ అటవీ శాఖ మంత్రి కే రాజు వెల్లడించారు. ఇంకేమన్నారంటే...

బ్రెజిల్​లో కరోనా విజృంభణ..

బ్రెజిల్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 1,473మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే?

విక్రయాలు షురూ

భారత మార్కెట్​లోకి శాంసంగ్ గెలాక్సీ ఏ -31 వచ్చేసింది. గెలాక్సీ ఏ -30 కొనసాగింపుగా ఈ మోడల్​ ఫీచర్లను తీసుకువచ్చారు. ధరలు ఎలా ఉన్నాయంటే..?

అత్యుత్తమం​ ఎవరంటే..?

లసిత్​ మలింగ, జస్ప్రీత్​ బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్​లో పదునైన యార్కర్లు వేయగలిగిన ప్రతిభావంతులు. వీరిద్దరు తమ ప్రదర్శనతో జట్టు బౌలింగ్ దళానికి వెన్నెముకగా నిలుస్తున్నారు. అలాంటి ఈ జోడి ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో ఒకే జట్టు తరఫున ఆడుతోంది. దీనిపై బుమ్రా ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.