Temperature in TS: రాష్ట్రంలో భానుడి భగభగలు ఇంకా తగ్గడం లేదు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా..: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అత్యధికంగా 45.7డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లాలోని కేతేపల్లి, నిడమనూరు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల్లాలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: కాసేపట్లో కేసీఆర్తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ భేటీ