ETV Bharat / state

రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మరింత మెరుగవ్వాలి : గవర్నర్

రాష్ట్రంలో మాతా, శిశు సంరక్షణ కోసం మరిన్ని వైద్య సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. రాజ్​భవన్​లో జరిగిన సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ కార్యక్రమంలో మూడు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను పంపిణీ చేశారు.

author img

By

Published : Nov 18, 2020, 11:21 PM IST

To increase medical facilities in ths state says governer
రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మరింత మెరుగవ్వాలి : గవర్నర్

రాష్ట్రవ్యాప్తంగా శిశు మరణాలు తగ్గించేందుకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్​ పేర్కొన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

రాజ్​భవన్​లో సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ (సీఎస్​ఐఆర్) కార్యక్రమంలో నీలోఫర్, ఎంఎన్​జే క్యాన్సర్, డిస్పెన్సరీకి ఒక్కో ఆల్ట్రాసౌండ్​ స్కానింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగుల వద్దకే వెళ్లి పరీక్షించేలా పరికరాలు తయారవుతున్నట్లు దాతలు వెల్లడించారు. తాను వైద్యురాలిగా పనిచేసే సమయంలో కేవలం వంద రూపాయలకే స్కానింగ్ చేసినట్లు గవర్నర్ గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన తెరాస

రాష్ట్రవ్యాప్తంగా శిశు మరణాలు తగ్గించేందుకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్​ పేర్కొన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

రాజ్​భవన్​లో సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ (సీఎస్​ఐఆర్) కార్యక్రమంలో నీలోఫర్, ఎంఎన్​జే క్యాన్సర్, డిస్పెన్సరీకి ఒక్కో ఆల్ట్రాసౌండ్​ స్కానింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగుల వద్దకే వెళ్లి పరీక్షించేలా పరికరాలు తయారవుతున్నట్లు దాతలు వెల్లడించారు. తాను వైద్యురాలిగా పనిచేసే సమయంలో కేవలం వంద రూపాయలకే స్కానింగ్ చేసినట్లు గవర్నర్ గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.