తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్న లోకేశ్ ఏపీ సీఎంచంద్రబాబు కుమారుడు లోకేశ్ మంగళగిరి తెదేపా అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన లోకేశ్కు ఆయన భార్య బ్రాహ్మిణి దిష్టి తీశారు. తల్లి భువనేశ్వరి ఎదురొచ్చారు. లోకేశ్కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చారు. ఇవీ చూడండి :లోక్సభకు పోటీ చేయాలా? వద్దా? సందిగ్ధంలో తెజస