ETV Bharat / state

రైతుబజార్లను తరలించేది అందుకే: సుధీర్​రెడ్డి - kovid- 19 updates

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రైతుబజార్లలో ప్రజల రద్దీ ఎక్కువ నమోదవుతున్న కారణంగా వాటిని ఇతర స్థలాల్లోకి మారుస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి తెలిపారు.

రైతుబజార్లను తరలించేది అందుకే: సుధీర్​రెడ్డి
రైతుబజార్లను తరలించేది అందుకే: సుధీర్​రెడ్డి
author img

By

Published : Mar 29, 2020, 3:20 PM IST

రైతుబజార్లను తరలించేది అందుకే: సుధీర్​రెడ్డి

రైతు బజార్లు ప్రమాదకారిగా మారవద్దనే ఉద్దేశంతోనే తరలిస్తున్నామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అయన పేర్కొన్నారు. హైదరాబాద్ కొత్తపేట రైతు బజారును విక్టోరియా మెమోరియల్ స్కూల్‌ గ్రౌండ్​కు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఎన్టీఆర్ రైతు బజార్‌ను సరూర్‌నగర్‌ స్టేడియానికి తరలిస్తున్నారు.

కూరగాయలు కొనడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుండడం వల్ల ముందస్తు చర్యలు చేపడుతున్నామని సుధీర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ఒక్కరికి శానిటైజర్‌ నిర్వహించిన తర్వాతనే లోపలికి పంపింస్తున్నామని చెప్పారు. విశాలమైన ప్రదేశంలో మార్కెట్‌ను తరలించడం ద్వారా కరోనా వ్యాధి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, మార్కెట్ శాఖాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కవితలు ప్రజలను చైతన్య పరుస్తాయి: మంత్రి అజయ్

రైతుబజార్లను తరలించేది అందుకే: సుధీర్​రెడ్డి

రైతు బజార్లు ప్రమాదకారిగా మారవద్దనే ఉద్దేశంతోనే తరలిస్తున్నామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అయన పేర్కొన్నారు. హైదరాబాద్ కొత్తపేట రైతు బజారును విక్టోరియా మెమోరియల్ స్కూల్‌ గ్రౌండ్​కు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఎన్టీఆర్ రైతు బజార్‌ను సరూర్‌నగర్‌ స్టేడియానికి తరలిస్తున్నారు.

కూరగాయలు కొనడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుండడం వల్ల ముందస్తు చర్యలు చేపడుతున్నామని సుధీర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ఒక్కరికి శానిటైజర్‌ నిర్వహించిన తర్వాతనే లోపలికి పంపింస్తున్నామని చెప్పారు. విశాలమైన ప్రదేశంలో మార్కెట్‌ను తరలించడం ద్వారా కరోనా వ్యాధి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, మార్కెట్ శాఖాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కవితలు ప్రజలను చైతన్య పరుస్తాయి: మంత్రి అజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.