ETV Bharat / state

దిశ కేసు: ఎన్​కౌంటర్​పై తుది నివేదికకు 6 నెలల గడువు

author img

By

Published : Jan 29, 2021, 7:50 PM IST

దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్​ కేసు తుది నివేదిక సమర్పణకు సుప్రీంకోర్టు గడువు పెంచింది. ఈ మేరకు జస్టిస్​ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. దర్యాప్తు కమిషన్​కు 6 నెలల గడువు ఇచ్చేందుకు అంగీకరించింది.

disha case, supreme court
దిశ కేసు, సుప్రీం కోర్టు

దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు తుది నివేదిక సమర్పణకు దర్యాప్తు కమిషన్​కు సుప్రీంకోర్టు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఎన్​కౌంటర్ ఘటనపై న్యాయవాది జీఎస్ మణి వేసిన పిటిషన్​లో సుప్రీంకోర్టు.. జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిషన్​ను నియమించింది. గతేడాది జూన్​లోనే కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉండగా.. కొవిడ్ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఆరు నెలల గడువు పొడిగించింది.

తాజాగా జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్​ మరో ఆరు నెలల గడువు కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. 6 నెలల గడువు ఇచ్చేందుకు అంగీకరించింది.

దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు తుది నివేదిక సమర్పణకు దర్యాప్తు కమిషన్​కు సుప్రీంకోర్టు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఎన్​కౌంటర్ ఘటనపై న్యాయవాది జీఎస్ మణి వేసిన పిటిషన్​లో సుప్రీంకోర్టు.. జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిషన్​ను నియమించింది. గతేడాది జూన్​లోనే కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉండగా.. కొవిడ్ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఆరు నెలల గడువు పొడిగించింది.

తాజాగా జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్​ మరో ఆరు నెలల గడువు కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. 6 నెలల గడువు ఇచ్చేందుకు అంగీకరించింది.

ఇదీ చదవండి: పన్నెండు రోజుల్లో పెళ్లి.. తండ్రీ కొడుకులే మిగిలారు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.