ETV Bharat / state

'పని ఒత్తిడితో ఆశాకార్యకర్త హఠాన్మరణం.. ఆందోళనకు దిగిన సహచరులు' - హైదరాబాద్ తాజా వార్తలు

asha worker died: పని ఒత్తిడితో ఆశా కార్యకర్త చనిపోయిన ఘటన రాష్ట్ర రాజధాని నగరంలో జరిగింది. మలక్​పేట పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సహచర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో ఆరోగ్యకేంద్రం ముందు బైఠాయించారు.

ధర్నా
ధర్నా
author img

By

Published : Jun 23, 2022, 3:10 PM IST

asha worker died: హైదరాబాద్‌ మలక్‌పేట పరిధి శాలివాహననగర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త హఠాన్మరణం చెందారు. బుధవారం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 35ఏళ్ల వయస్సున్న సుజాత అనే ఆశా కార్యకర్త ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని నిర్ధారించారు. పని ఒత్తిడితోనే సుజాత చనిపోయిందంటూ ఆరోపిస్తూ సహచర ఉద్యోగులు మృతదేహంతో ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

'పని ఒత్తిడితో ఆశాకార్యకర్త హఠాన్మరణం.. ఆందోళనకు దిగిన సహచరులు'

సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. తమపై పని ఒత్తిడి తగ్గించి తమ ఆరోగ్యం కాపాడాలని ఆశా వర్కర్లు అధికారులను వేడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు అందోళన చేస్తున్న ఆశావర్కర్లతో పాటు వీరికి మద్దతుగా నిలిచిన ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: ఎన్ఐఏ అదుపులో లాయర్లు​ శిల్ప, దేవేంద్ర.. రాధ మిస్సింగ్‌ కేసుపై విచారణ

42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. 'మహా' సర్కార్​ మనుగడ ఇక కష్టమే!

asha worker died: హైదరాబాద్‌ మలక్‌పేట పరిధి శాలివాహననగర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త హఠాన్మరణం చెందారు. బుధవారం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 35ఏళ్ల వయస్సున్న సుజాత అనే ఆశా కార్యకర్త ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని నిర్ధారించారు. పని ఒత్తిడితోనే సుజాత చనిపోయిందంటూ ఆరోపిస్తూ సహచర ఉద్యోగులు మృతదేహంతో ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

'పని ఒత్తిడితో ఆశాకార్యకర్త హఠాన్మరణం.. ఆందోళనకు దిగిన సహచరులు'

సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. తమపై పని ఒత్తిడి తగ్గించి తమ ఆరోగ్యం కాపాడాలని ఆశా వర్కర్లు అధికారులను వేడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు అందోళన చేస్తున్న ఆశావర్కర్లతో పాటు వీరికి మద్దతుగా నిలిచిన ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: ఎన్ఐఏ అదుపులో లాయర్లు​ శిల్ప, దేవేంద్ర.. రాధ మిస్సింగ్‌ కేసుపై విచారణ

42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. 'మహా' సర్కార్​ మనుగడ ఇక కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.