ETV Bharat / state

బల్దియా పోరుకు సిద్ధమైన పార్టీలు.. మారనున్న వ్యూహాలు

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం ప్రధాన రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసింది. త్వరలో జరిగే హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను మార్చబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని అధికార తెరాస ఆరాటపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా శక్తినంతటిని కూడదీసుకుని అధికస్థానాల్లో విజయానికి లక్ష్యం పెట్టుకొంది. తాజా ఫలితం తెచ్చిన ఉత్సాహంతో ఉన్న భాజపా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే ప్రణాళికల్లో నిమగ్నమైపోయింది. ఇక ఎంఐఎంతో పాటు ఇతర పార్టీలూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో బల్దియా పోరు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఏ పార్టీ ఎలా సన్నద్ధమవుతుందో ‘ఈనాడు - ఈటీవీ భారత్​’ ప్రత్యేక విశ్లేషణ కథనమిది.

author img

By

Published : Nov 12, 2020, 8:31 AM IST

Updated : Nov 12, 2020, 9:42 AM IST

The goal of all parties is GHMC elections
అందరి లక్ష్యం.. బల్దియా పీఠం

తెరాస: లోటుపాట్లకు ఆస్కారం లేకుండా..

ల్దియాలో మొత్తం 150 డివిజన్లు ఉంటే 2016లో తెరాస 99 దక్కించుకుంది. ఈసారి పదిస్థానాలు కాస్త అటుఇటూగా డివిజన్లను గెలవబోతున్నట్లు అగ్రనేతలు చెబుతున్నారు. దుబ్బాక ఫలితం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా లోటుపాట్లను అధిగమించాలని మంత్రి కేటీఆర్‌ భావిస్తున్నారు. గత ఐదేళ్లలో కొందరు కార్పొరేటర్లపై ఆరోపణలు వచ్చాయి. తమ డివిజన్‌లో ఎవరైనా ఇళ్లు నిర్మిస్తే చాలు వసూలు చేశారన్న విమర్శలున్నాయి. జనామోదం ఉన్న అభ్యర్థులనే నిలపాలని యోచిస్తున్నారు. తలసాని, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు డివిజన్ల వారీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. అలానే లబ్ధిదారులకు కనీసం 40 వేల ఇళ్లను పంపిణీ చేసే లక్ష్యంతో ఉన్నారు.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
తెరాస

భాజపా: దూకుడుగా ముందుకు

ప్రస్తుత పాలకవర్గంలో భాజపా కార్పొరేటర్లు నలుగురే. ఈసారి పీఠం మీదే పార్టీ కన్నేసింది. రాజధానిని పార్టీ పరంగా ఆరు జిల్లాలుగా చేసి ఆరుగురికి బాధ్యతలు అప్పగించారు. ప్రతి జిల్లాకు ఒక్కో అగ్రనేతను ఇన్‌ఛార్జిగా పెట్టనున్నారు. డివిజన్ల వారీగా చురుగ్గా ఉండే నాయకులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించబోతున్నారు. కొన్ని స్థానాలను జనసేన పార్టీకి ఇవ్వడం ద్వారా తమకు అదనపు బలంగా మారే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
భాజపా

కాంగ్రెస్‌: ప్రజా సమస్యలపై మేనిఫెస్టో

ఈ పాలకవర్గంలో ఇద్దరే సభ్యులున్నారు. డివిజన్ల వారీగా కమిటీలు వేసి కీలక బాధ్యతలను పార్టీ నేతలకు అప్పగించాలని నిర్ణయించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నగరంలోని ప్రధాన సమస్యలపై జనాభిప్రాయాన్ని తీసుకోబోతున్నారు. వీటిని క్రోడీకరించి మేనిఫెస్టోను విడుదల చేయాలన్నది ఆలోచన. ఎన్నికల్లో గెలిస్తే తాము వీటిని పరిష్కరిస్తామంటూ చెప్పనున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ జనాభిప్రాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుకు కూడా ఫీజు నిర్ణయించారు.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
కాంగ్రెస్

ఎంఐఎం: పాతబస్తీపై అదే పట్టు

ప్రస్తుత పాలకవర్గంలో 44 మంది కార్పొరేటర్లను కలిగి ఉన్న ఎంఐఎం ఈసారి కూడా సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. తెరాసతో అవగాహనతో ముందుకెళ్లే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా బరిలో నిలవాలని నిర్ణయించింది. ఈసారి ఎవరి పొత్తు లేకుండా బరిలో దిగే పరిస్థితి ఉంది. కూకట్‌పల్లితో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారిపై దృష్టిసారిస్తున్నారు. వామపక్షాలు, తెలంగాణ జనసమితి పొత్తు కుదిరితే ఆ పార్టీలు కూడా పోటీలో దిగి బలం ప్రదర్శించాలని అనుకుంటున్నాయి.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
ఎంఐఎం

తెరాస: లోటుపాట్లకు ఆస్కారం లేకుండా..

ల్దియాలో మొత్తం 150 డివిజన్లు ఉంటే 2016లో తెరాస 99 దక్కించుకుంది. ఈసారి పదిస్థానాలు కాస్త అటుఇటూగా డివిజన్లను గెలవబోతున్నట్లు అగ్రనేతలు చెబుతున్నారు. దుబ్బాక ఫలితం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా లోటుపాట్లను అధిగమించాలని మంత్రి కేటీఆర్‌ భావిస్తున్నారు. గత ఐదేళ్లలో కొందరు కార్పొరేటర్లపై ఆరోపణలు వచ్చాయి. తమ డివిజన్‌లో ఎవరైనా ఇళ్లు నిర్మిస్తే చాలు వసూలు చేశారన్న విమర్శలున్నాయి. జనామోదం ఉన్న అభ్యర్థులనే నిలపాలని యోచిస్తున్నారు. తలసాని, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు డివిజన్ల వారీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. అలానే లబ్ధిదారులకు కనీసం 40 వేల ఇళ్లను పంపిణీ చేసే లక్ష్యంతో ఉన్నారు.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
తెరాస

భాజపా: దూకుడుగా ముందుకు

ప్రస్తుత పాలకవర్గంలో భాజపా కార్పొరేటర్లు నలుగురే. ఈసారి పీఠం మీదే పార్టీ కన్నేసింది. రాజధానిని పార్టీ పరంగా ఆరు జిల్లాలుగా చేసి ఆరుగురికి బాధ్యతలు అప్పగించారు. ప్రతి జిల్లాకు ఒక్కో అగ్రనేతను ఇన్‌ఛార్జిగా పెట్టనున్నారు. డివిజన్ల వారీగా చురుగ్గా ఉండే నాయకులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించబోతున్నారు. కొన్ని స్థానాలను జనసేన పార్టీకి ఇవ్వడం ద్వారా తమకు అదనపు బలంగా మారే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
భాజపా

కాంగ్రెస్‌: ప్రజా సమస్యలపై మేనిఫెస్టో

ఈ పాలకవర్గంలో ఇద్దరే సభ్యులున్నారు. డివిజన్ల వారీగా కమిటీలు వేసి కీలక బాధ్యతలను పార్టీ నేతలకు అప్పగించాలని నిర్ణయించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నగరంలోని ప్రధాన సమస్యలపై జనాభిప్రాయాన్ని తీసుకోబోతున్నారు. వీటిని క్రోడీకరించి మేనిఫెస్టోను విడుదల చేయాలన్నది ఆలోచన. ఎన్నికల్లో గెలిస్తే తాము వీటిని పరిష్కరిస్తామంటూ చెప్పనున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ జనాభిప్రాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుకు కూడా ఫీజు నిర్ణయించారు.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
కాంగ్రెస్

ఎంఐఎం: పాతబస్తీపై అదే పట్టు

ప్రస్తుత పాలకవర్గంలో 44 మంది కార్పొరేటర్లను కలిగి ఉన్న ఎంఐఎం ఈసారి కూడా సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. తెరాసతో అవగాహనతో ముందుకెళ్లే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా బరిలో నిలవాలని నిర్ణయించింది. ఈసారి ఎవరి పొత్తు లేకుండా బరిలో దిగే పరిస్థితి ఉంది. కూకట్‌పల్లితో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారిపై దృష్టిసారిస్తున్నారు. వామపక్షాలు, తెలంగాణ జనసమితి పొత్తు కుదిరితే ఆ పార్టీలు కూడా పోటీలో దిగి బలం ప్రదర్శించాలని అనుకుంటున్నాయి.

అందరి లక్ష్యం.. బల్దియా పీఠం
ఎంఐఎం
Last Updated : Nov 12, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.