ETV Bharat / state

ఆహా చేప రుచి.. తింటున్నారు మైమరచి..

author img

By

Published : Feb 27, 2021, 8:43 PM IST

Updated : Feb 27, 2021, 11:52 PM IST

హైదరాబాద్​లోని సబ్జీమండిలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఫుడ్ మేళా చేపట్టినట్లు మత్స్యసహకార సంఘం అధ్యక్షురాలు శోభ బెస్త వెల్లడించారు.

The Fish Food Festival is in full swing at Sabjimandi in Hyderabad
ఆహా చేప రుచి.. తింటున్నారు మైమరచి

హైదరాబాద్ కార్వాన్​ నియోజకవర్గం పరిధిలోని సబ్జీమండిలో నిర్వహిస్తున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోంది. గంగపుత్ర మహిళలు చేసిన వంటకాల రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి తరలి వస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఫుడ్ మేళా చేపట్టినట్లు మత్స్యసహకార సంఘం అధ్యక్షురాలు శోభ బెస్త వెల్లడించారు.

గత ఏడాది హైదరాబాద్ మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ స్ఫూర్తిగా సబ్జి మండిలో ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందని నగర మత్స్య సహకార సొసైటీ ఛైర్​పర్సన్ కొప్పు పద్మ బెస్త అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ ఫిష్ ఫుడ్​ ఫెస్టివల్​లో సుమారు 40 రకాల చేపల పులుసు, చేప వేపుడు, హోల్ ఫిష్ , రొయ్యల వేపుడు, ఫిష్ లొలి పాప్, ఫిష్ బిర్యానీ, ఫిష్ కట్ లేట్, ఫిష్ కబాబ్ తదితర రుచులు అందుబాటులో ఉన్నాయని సంఘం అధ్యక్షురాలు విద్య బెస్త తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్జి మండి గంగపుత్ర మహిళా సంఘం, మహిళా మత్స్య సహకార సంఘం నేతలు పాల్గొన్నారు.

ఆహా చేప రుచి.. తింటున్నారు మైమరచి..

ఇదీ చదవండి: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధర రూ.250: కేంద్రం

హైదరాబాద్ కార్వాన్​ నియోజకవర్గం పరిధిలోని సబ్జీమండిలో నిర్వహిస్తున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోంది. గంగపుత్ర మహిళలు చేసిన వంటకాల రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి తరలి వస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఫుడ్ మేళా చేపట్టినట్లు మత్స్యసహకార సంఘం అధ్యక్షురాలు శోభ బెస్త వెల్లడించారు.

గత ఏడాది హైదరాబాద్ మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ స్ఫూర్తిగా సబ్జి మండిలో ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందని నగర మత్స్య సహకార సొసైటీ ఛైర్​పర్సన్ కొప్పు పద్మ బెస్త అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ ఫిష్ ఫుడ్​ ఫెస్టివల్​లో సుమారు 40 రకాల చేపల పులుసు, చేప వేపుడు, హోల్ ఫిష్ , రొయ్యల వేపుడు, ఫిష్ లొలి పాప్, ఫిష్ బిర్యానీ, ఫిష్ కట్ లేట్, ఫిష్ కబాబ్ తదితర రుచులు అందుబాటులో ఉన్నాయని సంఘం అధ్యక్షురాలు విద్య బెస్త తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్జి మండి గంగపుత్ర మహిళా సంఘం, మహిళా మత్స్య సహకార సంఘం నేతలు పాల్గొన్నారు.

ఆహా చేప రుచి.. తింటున్నారు మైమరచి..

ఇదీ చదవండి: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధర రూ.250: కేంద్రం

Last Updated : Feb 27, 2021, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.