Murder Plan to Kill TRS Minister : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితుల మెుదటి రోజు కస్టడీ ముగిసింది. హత్యకు రూ.15 కోట్లు ఎలా సమకూర్చుకున్నారనే దానిపై నిందితులను విచారించారు. నగదుపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
నిందితులను మరో మూడు రోజుల పాటు విచారించనున్నారు. మేడ్చల్ కోర్టు ఇచ్చిన కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో నిందితులు పిటిషన్ వేశారు. రాత్రి సమయాల్లో విచారించవద్దని కోర్టు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఇదీ చదవండి: పోలీసు కస్టడీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు నిందితులు