ETV Bharat / state

రికార్డు ధర పలికిన పసుపు.. రైతుల హర్షం - మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో పసుపు అధిక ధర

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో పసుపు పంటకు రికార్డు ధర వచ్చింది. మహదేవ్​ అనే రైతు పంటను... పుల్లూరి నవీన్​ ట్రేడర్స్ రూ.7111కు క్వింటాల్​ చొప్పున కొనుగోలు చేసింది.

termaric record price in metpally agriculture market yard
ఆన్​లైన్​ మార్కెట్​లో పసుపు రికార్డు ధర.. రైతుల హర్షం
author img

By

Published : Feb 8, 2021, 5:50 PM IST

Updated : Feb 8, 2021, 7:21 PM IST

ఈ సారి పసుపు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో రూ.7111 ధర పలకడం విశేషం. మార్కెట్ యార్డ్​లో పసుపు కొనుగోళ్లు ప్రారంభమైన పది రోజులకే.. అధిక ధర రావడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సోమవారం నాడు ప్రారంభమైన ఆన్​లైన్​ మార్కెట్​లో.. కాడిరకం రూ.7111, గోల రూ.6601, చూర రకం రూ. 4516 ధర పలికింది.

ఇబ్రహీంపట్నం మండలం అమ్మకపేటకు చెందిన మహదేవ్ అనే రైతుకు చెందిన సుమారు 5 క్వింటాళ్ల పసుపును పుల్లూరి నవీన్ ట్రేడర్స్ ఆన్​లైన్​లో రూ. 7111కు కొనుగోలు చేసింది. మెట్​పల్లి మార్కెట్​ యార్డులో ఇప్పటి వరకు కాడి రకం 567, గోల 268, చుర రకం 55 క్వింటాళ్ల వరకు కొనుగోలు జరిగినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు.

ఈ సారి పసుపు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో రూ.7111 ధర పలకడం విశేషం. మార్కెట్ యార్డ్​లో పసుపు కొనుగోళ్లు ప్రారంభమైన పది రోజులకే.. అధిక ధర రావడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సోమవారం నాడు ప్రారంభమైన ఆన్​లైన్​ మార్కెట్​లో.. కాడిరకం రూ.7111, గోల రూ.6601, చూర రకం రూ. 4516 ధర పలికింది.

ఇబ్రహీంపట్నం మండలం అమ్మకపేటకు చెందిన మహదేవ్ అనే రైతుకు చెందిన సుమారు 5 క్వింటాళ్ల పసుపును పుల్లూరి నవీన్ ట్రేడర్స్ ఆన్​లైన్​లో రూ. 7111కు కొనుగోలు చేసింది. మెట్​పల్లి మార్కెట్​ యార్డులో ఇప్పటి వరకు కాడి రకం 567, గోల 268, చుర రకం 55 క్వింటాళ్ల వరకు కొనుగోలు జరిగినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ ఫథకాలు: నిరంజన్ రెడ్డి

Last Updated : Feb 8, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.