ఏపీలోని.. తిరుమల - అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో.. జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని తితిదే అధికారులు సూచించారు. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:'ఆక్సిమీటర్' యాప్ వాడుతున్నారా? జర భద్రం!