హైదరాబాద్ తార్నాక చౌరస్తాలో వైఎస్ఆర్సీపీ కార్యదర్శి సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని అన్నారు. మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: exams cancel: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు