ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ప్రారంభమైందా?

author img

By

Published : Feb 21, 2022, 11:52 AM IST

Telangana temperature rises : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పగిటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ 30 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం... వేసవి కాలం ప్రారంభమైందని సూచిస్తోంది.

Telangana temperature rises, telangana weather update
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Telangana temperature rises : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాల్లోనూ గరిష్ఠంగా 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. సహజంగా మార్చి 1 నుంచి వేసవి కాలంగా పరిగణిస్తారు. అయితే ఈసారి కాస్త ముందుగానే వేసవికాలం ప్రారంభం కానున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటివరకు దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా... ఆదివారం నాడు ఒక్కసారిగా 34.4 డిగ్రీల సెల్సియస్​కు పెరిగింది.

ఈ ఏడాదిలో విస్తారమైన వర్షాలు కురిశాయి. తర్వాత రాష్ట్రాన్ని మంచుదుప్పటి కప్పేసింది. అనంతరం త్వరలో వేడిగాలులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా వెల్లడిస్తోంది. హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సగటున 19 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి. అధికారిక నివేదిక రానప్పటికీ... ఈ సంవత్సరం వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని... ఉష్ణోగ్రతల సగటు గరిష్ఠంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఖమ్మం, నిర్మల్‌లో ఆదివారం 37.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్ సహా పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: రాళ్లు తేలిన బాటల్లో బతుకు బితుకు.. కనీస వసతులకు దూరంగా పల్లెలు!

Telangana temperature rises : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాల్లోనూ గరిష్ఠంగా 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. సహజంగా మార్చి 1 నుంచి వేసవి కాలంగా పరిగణిస్తారు. అయితే ఈసారి కాస్త ముందుగానే వేసవికాలం ప్రారంభం కానున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటివరకు దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా... ఆదివారం నాడు ఒక్కసారిగా 34.4 డిగ్రీల సెల్సియస్​కు పెరిగింది.

ఈ ఏడాదిలో విస్తారమైన వర్షాలు కురిశాయి. తర్వాత రాష్ట్రాన్ని మంచుదుప్పటి కప్పేసింది. అనంతరం త్వరలో వేడిగాలులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా వెల్లడిస్తోంది. హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సగటున 19 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి. అధికారిక నివేదిక రానప్పటికీ... ఈ సంవత్సరం వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని... ఉష్ణోగ్రతల సగటు గరిష్ఠంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఖమ్మం, నిర్మల్‌లో ఆదివారం 37.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్ సహా పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: రాళ్లు తేలిన బాటల్లో బతుకు బితుకు.. కనీస వసతులకు దూరంగా పల్లెలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.