ETV Bharat / state

సాదాబైనామాలకు మరో అవకాశం

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

author img

By

Published : Oct 13, 2020, 5:20 AM IST

సాదాబైనామాలకు మరో అవకాశం
సాదాబైనామాలకు మరో అవకాశం

సాదాబైనామాలకు మరో అవకాశం ఇచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు చివరి అవకాశంగా వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ ద్వారా ఆన్ లైన్ విధానంలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తు చేసుకునేందుకు నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. 2014 జూన్​ 2నాటికి ముందు తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన వాటికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని... సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు 11.19 లక్షల దరఖాస్తులు రాగా... 6.18లక్షల దరఖాస్తులు పరిష్కరించింది.

సాదాబైనామాలకు మరో అవకాశం ఇచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు చివరి అవకాశంగా వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ ద్వారా ఆన్ లైన్ విధానంలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తు చేసుకునేందుకు నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. 2014 జూన్​ 2నాటికి ముందు తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన వాటికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని... సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు 11.19 లక్షల దరఖాస్తులు రాగా... 6.18లక్షల దరఖాస్తులు పరిష్కరించింది.

ఇదీ చూడండి: 'ఎవరూ డబ్బులు కట్టకండి... ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.