ETV Bharat / state

జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడిని ఖండించిన బండి సంజయ్​ - తెలుగు వార్తలు

బంగాల్​ పర్యటనలో ఉన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై రాళ్ల దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను బట్టి ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఎంత అధ్వాన్నంగా ఉందో అద్దం పడుతోందని పేర్కొన్నారు.

జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడిని ఖండించిన బండి సంజయ్​
జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడిని ఖండించిన బండి సంజయ్​
author img

By

Published : Dec 10, 2020, 8:59 PM IST

పశ్చిమ బంగాల్​లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్‌ కాంగ్రెస్ నాయకులు రాళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయుకుడి వాహనంపైనే రాళ్లు రువ్వారంటే అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అవగతమవుతున్నాయన్నారు.

తృణముల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిసి భాజపా కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేయడం, హత్య చేయడం ఇటీవల పరిపాటిగా మారిందన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు భాజపా కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్​ భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

పశ్చిమ బంగాల్​లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్‌ కాంగ్రెస్ నాయకులు రాళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయుకుడి వాహనంపైనే రాళ్లు రువ్వారంటే అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అవగతమవుతున్నాయన్నారు.

తృణముల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిసి భాజపా కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేయడం, హత్య చేయడం ఇటీవల పరిపాటిగా మారిందన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు భాజపా కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్​ భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

ఇదీ చూడండి: అక్రమాస్తుల కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.