మూసీ నదిలో మురికిని తొలగించి, సుందరమైన నదిగా తీర్చిదిద్దడానికి రూ.50 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో మూసీ నది ప్రక్షాళనకు రూ.10 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.
మూసీ నది చుట్టుపక్కల ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సోకకుండా తగిన చర్యలు చేపడతున్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం'