ETV Bharat / state

స్వచ్ఛ భారత్​లో మరోసారి తెలంగాణ హవా

author img

By

Published : Nov 18, 2020, 4:51 PM IST

మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ, పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి విభాగాలల్లో ఉత్తమ అవార్డులు తెలంగాణకు ఇప్పటికే దక్కాయి. తాజాగా మరో రెండు అవార్డులను ఖాతాలో వేసుకుంది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో రెండు జిల్లాలకు అవార్డులు వచ్చాయి.

telangana got swachh bharat two awards
స్వచ్ఛ భారత్​లో మరోసారి తెలంగాణ హవా

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు అవార్డులకు మరోసారి ఎంపికైనట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి లేఖ అందింది.

మన ఖాతాలో రెండు

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో ఉత్తమ్‌ ప్రతిభ, పనితీరు కనపరిచిన 20 జిల్లాలు అవార్డులకు ఎంపిక కాగా... అందులో రెండు మన రాష్ట్రానికి చెందినవే. ప్రపంచ టాయిలెట్స్‌ డే సందర్భంగా ఈ నెల 19న ఉదయం 11.30గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయనుంది.

మంత్రి అభినందనలు

అవార్డులు దక్కిన రెండు జిల్లాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలియచేశారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన అభిప్రాపడ్డారు. అవార్డులు ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే పలు అవార్డులు

రాష్ట్రానికి ఇప్పటికే స్వచ్ఛ భారత్, మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ, పచ్చదనం, పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో ఉత్తమ అవార్డులు వచ్చాయి. ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్‌లు, ఉత్తమ మండల పరిషత్‌లు, ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగాల్లో అనేక అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ మరోసారి రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.

గురువారం ప్రదానం

ఈ నెల 19న జరగనున్న వర్చువల్ ఈవెంట్ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, అవార్డులు వచ్చిన జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొనాలని కేంద్ర జలశక్తి శాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు అవార్డులకు మరోసారి ఎంపికైనట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి లేఖ అందింది.

మన ఖాతాలో రెండు

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో ఉత్తమ్‌ ప్రతిభ, పనితీరు కనపరిచిన 20 జిల్లాలు అవార్డులకు ఎంపిక కాగా... అందులో రెండు మన రాష్ట్రానికి చెందినవే. ప్రపంచ టాయిలెట్స్‌ డే సందర్భంగా ఈ నెల 19న ఉదయం 11.30గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయనుంది.

మంత్రి అభినందనలు

అవార్డులు దక్కిన రెండు జిల్లాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలియచేశారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన అభిప్రాపడ్డారు. అవార్డులు ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే పలు అవార్డులు

రాష్ట్రానికి ఇప్పటికే స్వచ్ఛ భారత్, మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ, పచ్చదనం, పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో ఉత్తమ అవార్డులు వచ్చాయి. ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్‌లు, ఉత్తమ మండల పరిషత్‌లు, ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగాల్లో అనేక అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ మరోసారి రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.

గురువారం ప్రదానం

ఈ నెల 19న జరగనున్న వర్చువల్ ఈవెంట్ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, అవార్డులు వచ్చిన జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొనాలని కేంద్ర జలశక్తి శాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.