ETV Bharat / state

ఇప్పటికైనా పీఆర్సీ ప్రకటించండి: ఉద్యోగుల సంఘం - prc protests at public health and family welfare office

ప్రభుత్వం సత్వరమే పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కోఠిలోని ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం ఎదుట నాయకులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఎన్నికలు ముగిసినందున ఇప్పటికైనా పీఆర్సీ ప్రకటించాలని కోరారు.

telangana employees union protests at public health and family welfare office
ఇప్పటికైనా పీఆర్సీ ప్రకటించండి: రాష్ట్ర ఉద్యోగుల సంఘం
author img

By

Published : Dec 10, 2020, 6:06 PM IST

ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించి బకాయి ఉన్న 2వ డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ కోఠిలోని ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం ముందు సంఘం నాయకులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.

ఎన్నికలు ఉన్నాయనే నెపంతో ప్రభుత్వం పీఆర్సీని వాయిదా వేస్తూ వచ్చిందని... ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... తమ పట్ల చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని పీఆర్సీ, డీఏలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించి బకాయి ఉన్న 2వ డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ కోఠిలోని ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం ముందు సంఘం నాయకులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.

ఎన్నికలు ఉన్నాయనే నెపంతో ప్రభుత్వం పీఆర్సీని వాయిదా వేస్తూ వచ్చిందని... ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... తమ పట్ల చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని పీఆర్సీ, డీఏలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ సతీష్ ప్రభుకు ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.