ETV Bharat / state

Telangana Congress Joinings : కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నించిన పలువురికి భంగపాటు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ తప్పలేదు!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 8:57 AM IST

Telangana Congress Joinings 2023 : కాంగ్రెస్​లో చేరేందుకు యత్నించిన పలువురు నాయకులు భంగపాటుకు గురయ్యారు. మరికొంతమంది నాయకులను కొంత ఆలస్యంగా చేర్చుకోనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం కాంగ్రెస్ చేర్చుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పటివరకు కాంగ్రెస్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.

Congress Party Joinings in Telangana
Congress Party
Telangana Congress Joinings కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నించిన పలువురికి భంగపాటు కొంత ఆలస్యం కావోచ్చు

Telangana Congress Joinings 2023 : కాంగ్రెస్‌లో చాలా నియోజకవర్గాల్లో.. బలమైన నాయకుల కొరత ఉంది. గతంలో పార్టీలో చేరతామని చెబితే వెంటపడి చేర్చుకుంటూ వచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటివారు వస్తారని తెలియగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(PCC President Revanth Reddy).. వారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. జోష్‌ పెరుగుతున్న కొద్దీ.. హస్తం పార్టీలో చేరేందుకు పలువురు పోటీపడుతున్నా.. అధిష్ఠానం విముఖతతో పలువురు భంగపాటుకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల బీఆర్ఎస్​లో టికెట్లు ఆశించి భంగపాటు గురైన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు(BRS Sitting MLAs), మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఏఐసీసీ(AICC)ని సంప్రదించి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాంటి వారి 15 మంది పేర్లను పీసీసీకి పంపిన అధిష్ఠానం వారి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి.. ఆయా నాయకులు పార్టీలోకి వస్తే జరిగే లాభనష్టాలు, గెలుపు ఓటమిలను అంచనా వేసి నివేదించినట్లు తెలుస్తోంది. అవినీతి, ఇతర ఆరోపణలు ఉండడంతో కొందరికి అధికార బీఆర్ఎస్ టికెట్లు(BRS MLA Tickets) నిరాకరించినట్లు తేల్చారు. అదే విషయాన్ని ఏఐసీసీకి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.

Congress Joinings in Telangana 2023 : ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసినా.. ఇప్పటివరకు పార్టీలో చేర్చుకోలేదు. హైదరాబాద్‌కి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్‌కు చెందిన మరో ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరేందుకు యత్నించి భంగపాటుకు గురయ్యారని సమాచారం. ఇద్దరు ఎంపీలు టికెట్లు ఇస్తేనే వస్తామని చెప్పినట్లు విస్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే వారు టికెట్‌ అడుగుతున్నచోట కాంగ్రెస్‌కి బలమైనవారుంటంతో సర్దుబాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు కలిసి వచ్చేటట్లుగా లేకపోవడం వల్లే పీసీసీ హామీ ఇవ్వలేకపోతున్నట్లు సమాచారం.

Telangana Congress Screening Committee : నేడే స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. త్వరలో కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

Congress Focus on Telangana Assembly Elections 2023 : ఇటీవల బీఆర్ఎస్​కి రాజీనామా చేసిన ఓ నాయకుడు సీడబ్ల్యూసీ సమావేశాలు(CWC Meetings) జరుగుతున్నప్పుడు తాజ్​కృష్ణ హోటల్‌కి వచ్చినా.. చేర్చుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలోకి వచ్చేందుకు కొంతకాలంగా యత్నిస్తున్నా సఫలం అయ్యేందుకు మరికొంత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఓ నాయకుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌కి చెందిన ఓ ఫార్మాసిటికల్ వ్యాపారి కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( MLA Mynampally Hanumantha Rao).. సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగినా రెండు అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హనుమంతరావుకి ఆ రెండు కాకుండా మరికొన్ని స్థానాలు గెలిపించే సత్తా ఉందని పేర్కొంటున్నారు. అయితే టికెట్లపై ఏఐసీసీ కొలిక్కి రాకపోవడంతో హనుమంతరావు చేరిక మరికొంత ఆలస్యం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నాయకులు కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Focus on MLA Candidates Selection : కాంగ్రెస్ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థుల చొరవ.. టికెట్‌ కోసం లాబీయింగ్​లు

Congress Focus On Six Guarantees : ఆరు గ్యారంటీలు.. ప్రజలకి చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న కాంగ్రెస్​

Telangana Congress Joinings కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నించిన పలువురికి భంగపాటు కొంత ఆలస్యం కావోచ్చు

Telangana Congress Joinings 2023 : కాంగ్రెస్‌లో చాలా నియోజకవర్గాల్లో.. బలమైన నాయకుల కొరత ఉంది. గతంలో పార్టీలో చేరతామని చెబితే వెంటపడి చేర్చుకుంటూ వచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటివారు వస్తారని తెలియగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(PCC President Revanth Reddy).. వారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. జోష్‌ పెరుగుతున్న కొద్దీ.. హస్తం పార్టీలో చేరేందుకు పలువురు పోటీపడుతున్నా.. అధిష్ఠానం విముఖతతో పలువురు భంగపాటుకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల బీఆర్ఎస్​లో టికెట్లు ఆశించి భంగపాటు గురైన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు(BRS Sitting MLAs), మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఏఐసీసీ(AICC)ని సంప్రదించి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాంటి వారి 15 మంది పేర్లను పీసీసీకి పంపిన అధిష్ఠానం వారి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి.. ఆయా నాయకులు పార్టీలోకి వస్తే జరిగే లాభనష్టాలు, గెలుపు ఓటమిలను అంచనా వేసి నివేదించినట్లు తెలుస్తోంది. అవినీతి, ఇతర ఆరోపణలు ఉండడంతో కొందరికి అధికార బీఆర్ఎస్ టికెట్లు(BRS MLA Tickets) నిరాకరించినట్లు తేల్చారు. అదే విషయాన్ని ఏఐసీసీకి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.

Congress Joinings in Telangana 2023 : ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసినా.. ఇప్పటివరకు పార్టీలో చేర్చుకోలేదు. హైదరాబాద్‌కి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్‌కు చెందిన మరో ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరేందుకు యత్నించి భంగపాటుకు గురయ్యారని సమాచారం. ఇద్దరు ఎంపీలు టికెట్లు ఇస్తేనే వస్తామని చెప్పినట్లు విస్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే వారు టికెట్‌ అడుగుతున్నచోట కాంగ్రెస్‌కి బలమైనవారుంటంతో సర్దుబాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు కలిసి వచ్చేటట్లుగా లేకపోవడం వల్లే పీసీసీ హామీ ఇవ్వలేకపోతున్నట్లు సమాచారం.

Telangana Congress Screening Committee : నేడే స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. త్వరలో కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

Congress Focus on Telangana Assembly Elections 2023 : ఇటీవల బీఆర్ఎస్​కి రాజీనామా చేసిన ఓ నాయకుడు సీడబ్ల్యూసీ సమావేశాలు(CWC Meetings) జరుగుతున్నప్పుడు తాజ్​కృష్ణ హోటల్‌కి వచ్చినా.. చేర్చుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలోకి వచ్చేందుకు కొంతకాలంగా యత్నిస్తున్నా సఫలం అయ్యేందుకు మరికొంత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఓ నాయకుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌కి చెందిన ఓ ఫార్మాసిటికల్ వ్యాపారి కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( MLA Mynampally Hanumantha Rao).. సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగినా రెండు అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హనుమంతరావుకి ఆ రెండు కాకుండా మరికొన్ని స్థానాలు గెలిపించే సత్తా ఉందని పేర్కొంటున్నారు. అయితే టికెట్లపై ఏఐసీసీ కొలిక్కి రాకపోవడంతో హనుమంతరావు చేరిక మరికొంత ఆలస్యం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నాయకులు కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Focus on MLA Candidates Selection : కాంగ్రెస్ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థుల చొరవ.. టికెట్‌ కోసం లాబీయింగ్​లు

Congress Focus On Six Guarantees : ఆరు గ్యారంటీలు.. ప్రజలకి చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.